అత్యాచారానికి ఉరిశిక్షే

- November 26, 2017 , by Maagulf
అత్యాచారానికి ఉరిశిక్షే

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మైనర్‌ బాలికల (12 ఏళ్ల లోపు)పై అత్యాచారం చేసేవారికి ఉరిశిక్ష విధించాలన్న నిర్ణయానికి మధ్యప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి వర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు పెరుగుతు దశలో ఇటువంటి చట్టం ఆవశ్యకత ఉందని మధ్యప్రదేశ్‌ హోంశాఖ మంత్రి భూపేంద్ర సింగ్‌ తెలిపారు. గత రెండ నెలల్లో మధ్యప్రదేశ్‌లో అత్యాచారాలు, వేధింపుల కేసులు భారీగా నమోదుతున్న విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్‌ మంత్రివర్గం ఆమోదించిన ఈ తీర్మానంతో.. రాష్ట్ర శిక్షా స్మృతిని సవరించే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com