రెహ్మాన్ గానానికి పరవశించిన భాగ్యనగరం
- November 26, 2017
రాయదుర్గం: 'జయహో.. జయహో..' 'వూర్వశీ.. వూర్వశీ..' 'ముస్తఫా.. ముస్తఫా' వంటి పాటల ఝరిలో నగరవాసులు తడిసి ముద్దయ్యారు. 'హైదరాబాద్ టాకీస్' ఆధ్వర్యంలో 'ఎంకోర్' అనే పేరుతో ఆదివారం రాత్రి గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఏఆర్ రెహ్మాన్ సంగీత కచేరి ఉల్లాసంగా సాగింది. ఆయన పాటలతో యువత సంగీత డోలికల్లో నృత్యాలు చేస్తూ సందడి చేశారు. వర్ధమాన సినీగాయకులుగా ప్రేక్షలుగా హాజరై ఆయన పాటలను ఆస్వాదించారు. ఆఖరులో ప్రేక్షకులంతా సెల్ఫోన్ లైట్లు వేసి స్ఫూర్తి అందించాలని రెహ్మాన్ కోరడంతో స్టేడియం సెల్ఫోన్లైట్లతో వెలిగి పోయింది. కార్యక్రమానికి రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు, సినీనటులు అల్లరి నరేష్, సాయిధరమ్ తేజ్, రాశిఖన్నా తదితరులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష