రెహ్మాన్ గానానికి పరవశించిన భాగ్యనగరం
- November 26, 2017
రాయదుర్గం: 'జయహో.. జయహో..' 'వూర్వశీ.. వూర్వశీ..' 'ముస్తఫా.. ముస్తఫా' వంటి పాటల ఝరిలో నగరవాసులు తడిసి ముద్దయ్యారు. 'హైదరాబాద్ టాకీస్' ఆధ్వర్యంలో 'ఎంకోర్' అనే పేరుతో ఆదివారం రాత్రి గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఏఆర్ రెహ్మాన్ సంగీత కచేరి ఉల్లాసంగా సాగింది. ఆయన పాటలతో యువత సంగీత డోలికల్లో నృత్యాలు చేస్తూ సందడి చేశారు. వర్ధమాన సినీగాయకులుగా ప్రేక్షలుగా హాజరై ఆయన పాటలను ఆస్వాదించారు. ఆఖరులో ప్రేక్షకులంతా సెల్ఫోన్ లైట్లు వేసి స్ఫూర్తి అందించాలని రెహ్మాన్ కోరడంతో స్టేడియం సెల్ఫోన్లైట్లతో వెలిగి పోయింది. కార్యక్రమానికి రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు, సినీనటులు అల్లరి నరేష్, సాయిధరమ్ తేజ్, రాశిఖన్నా తదితరులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







