నారా బ్రాహ్మణి: ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ ఉండాల్సింది సిటీలో కాదు, పల్లెల్లో

- November 28, 2017 , by Maagulf
నారా బ్రాహ్మణి: ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ ఉండాల్సింది సిటీలో కాదు, పల్లెల్లో

హైదరాబాద్‌: ప్రతి మహిళకు ప్రపంచ స్ధితిగతులను మార్చే శక్తి ఉందని నారా బ్రాహ్మణి పేర్కొన్నారు. కాగా, ఈ రోజు ఆమె హైదరాబాద్‌ నగరంలో జరుగుతున్న జీఈఎస్‌ సదస్సుకు హాజరై మీడియాతో మాట్లాడారు. ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ ఉండాల్సింది సిటీలో కాదని, పల్లెల్లో ప్రారంభం కావాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుత రోజుల్లో చిన్న సంస్థల్లో మహిళలకు ప్రోత్సాహం తక్కువగా ఉందని, రానున్న రోజుల్లో మరింత మార్పు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అలాగే, మహిళా పారిశ్రామికవేత్తల్లో ఈ సదస్సు స్ఫూర్తి నింపుతుందని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు నారా బ్రాహ్మణి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com