నా రాజీనామా వార్తల్లో నిజం లేదు
- November 28, 2017
హైదరాబాద్: తన పదవికి రాజీనామా చేశాననే వార్తల్ని హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ ఖండించారు. మెట్రో ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా గౌరవించిందని, ప్రధానికి ఘనంగా స్వాగతం పలికానని రామ్మోహన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ''నగర ప్రథమ పౌరుడు బీసీ వర్గానికి చెందిన వ్యక్తి. ఆ కారణంతోనే సర్కారు శిలాఫలకంలో స్థానం ఇవ్వలేదు. ఇదే విషయమై తీవ్ర అసంతృప్తికి గురైన మేయర్ రాజీనామాకు సిద్ధమయ్యారు'' అంటూ మంగళవారం ఉదయం నుంచి వాట్సప్, ఫేస్బుక్లో వార్తలు గుప్పుమన్నాయి. వీటిపై స్పందించిన రామ్మోహన్ సైబర్క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ''కొందరు వ్యక్తులు ప్రభుత్వంపై కక్షతో ఇలాంటి వార్తలు సృష్టిస్తున్నారు. వారం క్రితం కూడా ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్)కు మేయర్ను ఆహ్వానించలేదు. నగరానికి ఇది అవమానకరం'' అంటూ ఇలానే వార్తలు గుప్పుమన్నాయని నేర విభాగం అదనపు కమిషనర్ రఘువీర్కు మేయర్ వివరించారు.
జీఈఎస్ ప్రైవేటు కార్యక్రమమని, అందులో ప్రోటోకాల్ ప్రసక్తే ఉండదన్నారు. అనవసరమైన వార్తల్ని సృష్టిస్తూ ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయాలనుకుంటున్న కుట్రదారుల్ని గుర్తించి చట్టప్రకారం శిక్షించాలని ఆయన పోలీసుల్ని కోరారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









