నా రాజీనామా వార్తల్లో నిజం లేదు
- November 28, 2017
హైదరాబాద్: తన పదవికి రాజీనామా చేశాననే వార్తల్ని హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ ఖండించారు. మెట్రో ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా గౌరవించిందని, ప్రధానికి ఘనంగా స్వాగతం పలికానని రామ్మోహన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ''నగర ప్రథమ పౌరుడు బీసీ వర్గానికి చెందిన వ్యక్తి. ఆ కారణంతోనే సర్కారు శిలాఫలకంలో స్థానం ఇవ్వలేదు. ఇదే విషయమై తీవ్ర అసంతృప్తికి గురైన మేయర్ రాజీనామాకు సిద్ధమయ్యారు'' అంటూ మంగళవారం ఉదయం నుంచి వాట్సప్, ఫేస్బుక్లో వార్తలు గుప్పుమన్నాయి. వీటిపై స్పందించిన రామ్మోహన్ సైబర్క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ''కొందరు వ్యక్తులు ప్రభుత్వంపై కక్షతో ఇలాంటి వార్తలు సృష్టిస్తున్నారు. వారం క్రితం కూడా ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్)కు మేయర్ను ఆహ్వానించలేదు. నగరానికి ఇది అవమానకరం'' అంటూ ఇలానే వార్తలు గుప్పుమన్నాయని నేర విభాగం అదనపు కమిషనర్ రఘువీర్కు మేయర్ వివరించారు.
జీఈఎస్ ప్రైవేటు కార్యక్రమమని, అందులో ప్రోటోకాల్ ప్రసక్తే ఉండదన్నారు. అనవసరమైన వార్తల్ని సృష్టిస్తూ ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయాలనుకుంటున్న కుట్రదారుల్ని గుర్తించి చట్టప్రకారం శిక్షించాలని ఆయన పోలీసుల్ని కోరారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష