ఇజ్రాయిల్లో భారీ అగ్ని ప్రమాదం...నలుగురు మృతి
- November 28, 2017
జెరూసలేమ్ : ఇజ్రాయిల్లోని టెల్అవీవ్ నగరంలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరికొంత మంది ఆచూకీ తెలియరాలేదు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రత్యేక బృందాలు, అగ్నిమాపక అధికారులు రంగంలోకి దిగారు. ఘటనాస్థలి వద్ద మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక వాహనాలు మంటలను ఆర్పివేసే పనిలో నిమగమయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఘటనాస్థలం వద్ద ముమ్మర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...టెల్అవీవ్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మంటల్లో చిక్కుకున్న ఐదుగురిని సహాయక బృందాలు బయటకు తీసుకొచ్చాయి. వారిలో ప్రస్తుతం ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో ఓ భవనం పూర్తిగా కాలిపోయిందని, భవనం నుంచి అరుపులు కేకలు వినిపించాయని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్టు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







