ఇజ్రాయిల్లో భారీ అగ్ని ప్రమాదం...నలుగురు మృతి
- November 28, 2017
జెరూసలేమ్ : ఇజ్రాయిల్లోని టెల్అవీవ్ నగరంలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరికొంత మంది ఆచూకీ తెలియరాలేదు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రత్యేక బృందాలు, అగ్నిమాపక అధికారులు రంగంలోకి దిగారు. ఘటనాస్థలి వద్ద మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక వాహనాలు మంటలను ఆర్పివేసే పనిలో నిమగమయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఘటనాస్థలం వద్ద ముమ్మర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...టెల్అవీవ్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మంటల్లో చిక్కుకున్న ఐదుగురిని సహాయక బృందాలు బయటకు తీసుకొచ్చాయి. వారిలో ప్రస్తుతం ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో ఓ భవనం పూర్తిగా కాలిపోయిందని, భవనం నుంచి అరుపులు కేకలు వినిపించాయని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్టు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









