ఇండియాకి జెట్ ఎయిర్వేస్ స్పెషల్ ఫేర్స్
- November 29, 2017
మస్కట్:జెట్ ఎయిర్వేస్ సంస్థ, ఇండియా సహా బంగ్లాదేశ్, హాంగ్కాంగ్, నేపాల్, సింగపూర్, శ్రీలంక మరియు థాయిలాండ్ తదితర దేశాలకోసం ప్రత్యేక డిస్కౌంట్ ధరలతో విమానాల్ని మస్కట్ నుంచి నిర్వహిస్తోంది. ప్రీమియర్, ఎకానమీ క్లాస్ టిక్కెట్స్పై 12 శాతం డిస్కౌంట్తో విమాన ప్రయాణీకుల్ని ఆకర్షిస్తోంది జెట్ ఎయిర్ వేస్. ఆన్లైన్ ద్వారా నవంబర్ 29 నుంచి డిసెంబర్ 1 వరకు బుక్ చేసుకున్న టిక్కెట్లకు ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. నవంబర్ 29 నుంచి మే 31 వరకు ఈ డిస్కౌంట్ ధరలతో ప్రయాణించే వీలుంది. జెట్ ఎయిర్ వేస్ ఒమన్ జనరల్ మేనేజర్ వాసిమ్ జైది మాట్లాడుతూ, ఈ ప్రమోషన్ని వినియోగించుకుని విమాన ప్రయాణీకులు తక్కువ ధరలకే తమ ప్రయాణాలు చేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ముంబై, కొలంబో, గోవా, బ్యాంగ్కాక్ వంటి స్థానాలకు ఈ డిస్కౌంట్ ఫేర్స్ వర్తిస్తాయి.
తాజా వార్తలు
- Asia Cup 2025: Gautam Gambhir changes handshake protocol after Pakistan match
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!