ఇండియాకి జెట్ ఎయిర్వేస్ స్పెషల్ ఫేర్స్
- November 29, 2017
మస్కట్:జెట్ ఎయిర్వేస్ సంస్థ, ఇండియా సహా బంగ్లాదేశ్, హాంగ్కాంగ్, నేపాల్, సింగపూర్, శ్రీలంక మరియు థాయిలాండ్ తదితర దేశాలకోసం ప్రత్యేక డిస్కౌంట్ ధరలతో విమానాల్ని మస్కట్ నుంచి నిర్వహిస్తోంది. ప్రీమియర్, ఎకానమీ క్లాస్ టిక్కెట్స్పై 12 శాతం డిస్కౌంట్తో విమాన ప్రయాణీకుల్ని ఆకర్షిస్తోంది జెట్ ఎయిర్ వేస్. ఆన్లైన్ ద్వారా నవంబర్ 29 నుంచి డిసెంబర్ 1 వరకు బుక్ చేసుకున్న టిక్కెట్లకు ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. నవంబర్ 29 నుంచి మే 31 వరకు ఈ డిస్కౌంట్ ధరలతో ప్రయాణించే వీలుంది. జెట్ ఎయిర్ వేస్ ఒమన్ జనరల్ మేనేజర్ వాసిమ్ జైది మాట్లాడుతూ, ఈ ప్రమోషన్ని వినియోగించుకుని విమాన ప్రయాణీకులు తక్కువ ధరలకే తమ ప్రయాణాలు చేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ముంబై, కొలంబో, గోవా, బ్యాంగ్కాక్ వంటి స్థానాలకు ఈ డిస్కౌంట్ ఫేర్స్ వర్తిస్తాయి.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









