ఇండియాకి జెట్ ఎయిర్వేస్ స్పెషల్ ఫేర్స్
- November 29, 2017
మస్కట్:జెట్ ఎయిర్వేస్ సంస్థ, ఇండియా సహా బంగ్లాదేశ్, హాంగ్కాంగ్, నేపాల్, సింగపూర్, శ్రీలంక మరియు థాయిలాండ్ తదితర దేశాలకోసం ప్రత్యేక డిస్కౌంట్ ధరలతో విమానాల్ని మస్కట్ నుంచి నిర్వహిస్తోంది. ప్రీమియర్, ఎకానమీ క్లాస్ టిక్కెట్స్పై 12 శాతం డిస్కౌంట్తో విమాన ప్రయాణీకుల్ని ఆకర్షిస్తోంది జెట్ ఎయిర్ వేస్. ఆన్లైన్ ద్వారా నవంబర్ 29 నుంచి డిసెంబర్ 1 వరకు బుక్ చేసుకున్న టిక్కెట్లకు ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. నవంబర్ 29 నుంచి మే 31 వరకు ఈ డిస్కౌంట్ ధరలతో ప్రయాణించే వీలుంది. జెట్ ఎయిర్ వేస్ ఒమన్ జనరల్ మేనేజర్ వాసిమ్ జైది మాట్లాడుతూ, ఈ ప్రమోషన్ని వినియోగించుకుని విమాన ప్రయాణీకులు తక్కువ ధరలకే తమ ప్రయాణాలు చేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ముంబై, కొలంబో, గోవా, బ్యాంగ్కాక్ వంటి స్థానాలకు ఈ డిస్కౌంట్ ఫేర్స్ వర్తిస్తాయి.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









