కోర్టులోనే విషం తాగి చనిపోయిన ఖైదీ
- November 29, 2017
యుద్ధం పేరుతో లక్షల మంది ప్రాణాలను బలి తీసుకున్నారంటూ ఓ ఖైదీకి శిక్ష విధించింది న్యాయస్థానం. అది విన్న అతడు తాను ఏ నేరం చేయలేదని అరుస్తూ కోర్టు ప్రాంగణంలోనే విషం తాగి చనిపోయాడు. నెదర్లాండ్స్లోని ది హేగ్ అంతర్జాతీయ నేర న్యాయస్థానంలో ఈ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
బోస్నియా-హెర్జ్గోవినాలో 1990లో యుద్ధం జరిగింది. ఇందులో లక్ష మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ యుద్ధానికి కారణం బోస్నియా క్రోట్ నాయకులేనంటూ అక్కడి ప్రభుత్వం వారిని నేరస్థులుగా నిర్ధారించింది. ఇందులో బోస్నియా క్రోట్ నేత, 72ఏళ్ల స్లోబోడన్ ప్రల్జక్ ఉన్నాడు. ఈ కేసుపై బుధవారం విచారణ చేపట్టిన అంతర్జాతీయ న్యాయస్థానం స్లోబోడన్కు 20ఏళ్ల జైలుశిక్ష విధించింది. అతడితో పాటు మరో ఐదుగురికి 10 నుంచి 25ఏళ్ల వరకు జైలుశిక్షలు ఖరారు చేసింది.
అయితే న్యాయస్థానం తీర్పు విన్న స్లోబోడన్ ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యాడు. తాను నేరస్థుడిని కాదని అరుస్తూ తన చేతిలోని ప్లాస్టిక్ కప్పులో ఉన్న ద్రవాన్ని తాగి కుప్పకూలిపోయాడు. స్లోబోడన్ విషం తాగినట్లు అతడి తరఫు న్యాయవాది కోర్టుకు చెప్పారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









