ఫైనల్స్ కు ఎంపికైన పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్
- November 30, 2017
ఢిల్లీ: డిసెంబరు 13 నుంచి 17వ తేదీ వరకు దుబాయ్లో జరిగే సూపర్ సిరీస్ ఫైనల్స్లో తలపడేందుకు తెలుగు తేజాలు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ లు ఎంపికయ్యారు. ప్రపంచ ర్యాంకింగ్స్లో టాప్-8 స్థానాల్లో ఉన్న క్రీడాకారులు సూపర్ సిరీస్ ఫైనల్స్లో తలపడేందుకు అవకాశం దక్కుతోంది. మహిళల సింగిల్స్లో ప్రస్తుతం సింధు మూడో స్థానంలో కొనసాగుతుండగా.. పురుషుల సింగిల్స్లో కిదాంబి శ్రీకాంత్ ఐదో ర్యాంకును దక్కించుకున్నాడు. దీంతో వీరిద్దరు మాత్రమే ఈ టోర్నీకి అర్హత సాధించారు. హెచ్ ఎస్ ప్రణయ్, సైనా నెహ్వాల్ 10వ ర్యాంకులో కొనసాగుతున్నారు.తాజాగా సింధు హాంకాంగ్ సూపర్ సిరీస్ ఫైనల్లో రన్నరప్గా నిలిచిన సంగతి తెలిసిందే. అలాగే శ్రీకాంత్ ఈ ఏడాది నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లు గెలిచాడు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







