ఫైనల్స్ కు ఎంపికైన పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్
- November 30, 2017
ఢిల్లీ: డిసెంబరు 13 నుంచి 17వ తేదీ వరకు దుబాయ్లో జరిగే సూపర్ సిరీస్ ఫైనల్స్లో తలపడేందుకు తెలుగు తేజాలు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ లు ఎంపికయ్యారు. ప్రపంచ ర్యాంకింగ్స్లో టాప్-8 స్థానాల్లో ఉన్న క్రీడాకారులు సూపర్ సిరీస్ ఫైనల్స్లో తలపడేందుకు అవకాశం దక్కుతోంది. మహిళల సింగిల్స్లో ప్రస్తుతం సింధు మూడో స్థానంలో కొనసాగుతుండగా.. పురుషుల సింగిల్స్లో కిదాంబి శ్రీకాంత్ ఐదో ర్యాంకును దక్కించుకున్నాడు. దీంతో వీరిద్దరు మాత్రమే ఈ టోర్నీకి అర్హత సాధించారు. హెచ్ ఎస్ ప్రణయ్, సైనా నెహ్వాల్ 10వ ర్యాంకులో కొనసాగుతున్నారు.తాజాగా సింధు హాంకాంగ్ సూపర్ సిరీస్ ఫైనల్లో రన్నరప్గా నిలిచిన సంగతి తెలిసిందే. అలాగే శ్రీకాంత్ ఈ ఏడాది నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లు గెలిచాడు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









