కుదిపేస్తున్న 'ఓఖీ' తుపాను

- November 30, 2017 , by Maagulf
కుదిపేస్తున్న 'ఓఖీ' తుపాను

చెన్నై : బంగాళాఖాతంలో ఏర్పడిన 'ఓఖీ' తుపాను అరేబియా సముద్రం మీదుగా పయనిస్తోంది. ఈ 'ఓఖీ' తుపాన్ ప్రభావంతో తమిళనాడు, కేరళ, లక్షద్వీప్ లపై అధికంగా ఉంది. తిరువనంతపురానికి 130 కిలోమీటర్ల దూరం కేంద్రీకృతమై ఉన్న తుపాను వల్ల 8 మంది మృతి చెందారు. తమిళనాడులో చేపల వేటకు వెళ్లిన 80 మంది జాలర్ల ఆచూకీ తెలియక పోవడంతో వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు.తూత్తుకుడి, కన్యాకుమారి జిల్లాల్లో భారీ వర్షాల వల్ల లోతట్టుప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. తుపాను ప్రభావం వల్ల శుక్రవారం పాఠశాలలకు తమిళనాడు సర్కారు సెలవు ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com