డబ్బింగ్ పనులు పూర్తిచేసిన విక్రమ్
- November 30, 2017
చెన్నై: 'మూవీ ఫ్రేమ్' బ్యానరుపై కలైపులి ఎస్.థాణు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న చిత్రం 'స్కెచ్'. ఇందులో విక్రమ్ కథానాయకుడు. ఆయనకు జంటగా తమన్నా నటిస్తున్నారు. హాస్య నటుడు సూరి, ఆర్కే సురేష్, అరుళ్దాస్, హరీశ్, శ్రీమాన్, మధుమిత ఇతర తారాగణం. ప్రధాన పాత్రలో శ్రీ ప్రియాంక నటిస్తున్నారు. విద్యాసాగర్ దర్శకత్వం వహిస్తుండగా.... ఎస్.తమన్ సంగీతం అందించారు. కొంతకాలంగా నిర్మాణ పనులను వేగవంతం చేశారు.
అనంతరం డబ్బింగ్ పనులు చేపట్టారు. ఇటీవల విక్రమ్ సుమారు పది రోజులపాటు సమయం కేటాయించి నిర్విరామంగా తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేశారు. బుధవారంతో ఇవి పూర్తయినట్లు చిత్ర బృందం వివరించింది. విక్రమ్ ఈ చిత్రం కోసం ఓ పాట ఆలపించారు.
ఆడియో విడుదల కార్యక్రమం త్వరలో జరుగనుంది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







