త్వరలో జపాన్ యువరాజుకు పట్టాభిషేకం
- November 30, 2017టోక్యో: జపాన్ చక్రవర్తి అకిహితో తన సింహాసనాన్ని త్యజించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 30వ తేదీన ఆయన తన సింహాసాన్ని వదులుకోనున్నారు. ఈ విషయాన్ని ప్రధాని షింజో అబే తెలియజేశారు. రాచ కుటుంబంతో చర్చలు నిర్వహించిన తర్వాత జపాన్ ప్రభుత్వం ఈ తేదీని ప్రకటించడం విశేషం. వయసు, ఆరోగ్యం వల్ల తన విధులు నిర్వర్తించడం ఇబ్బందిగా మారిందని 83 ఏళ్ల అకిహితో ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. చక్రవర్తి అకిహితో తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదిస్తూ ఆ దేశ మంత్రివర్గం గతంలో ఒక బిల్లును ఆమోదించింది. ప్రధానమంత్రి సింజో అబే మంత్రివర్గం ఆ బిల్లుపై సంతకం చేసింది. జపాన్లో రెండు శతాబ్దాల కాలంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి. బిల్లు చట్టంగా మారిన మూడేండ్లలోపు చక్రవర్తి సింహాసనాన్ని పరిత్యజించవచ్చు. 2018 డిసెంబర్ నాటికి సింహాసనం దిగిపోవాలని జపాన్ చక్రవర్తి 83 ఏండ్ల అకిహితో నిర్ణయించుకున్నట్టు, 2019 జనవరి ఒకటి నాటికి సింహాసనానికి వారసుడైన యువరాజు నరుహితోకు ఆ బాధ్యతలు అప్పగించాలనుకున్నట్టు ఇటీవల వార్తలు వెలుబడ్డ విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ