పాకిస్తాన్...ఉగ్రవాదుల స్వర్గం
- November 30, 2017
వాషింగ్టన్ : పాకిస్తాన్ ఉగ్రవాదుల స్వర్గమని మరోసారి అమెరికా పేర్కొంది. ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్నుంచి పారిపోయిన తాలిబన్లు.. పాకిస్తాన్లో క్షేమంగా ఉన్నారని ఆఫ్ఘనిస్తాన్లోని సంకీర్ణ బలగాల సైన్యాధికారి జనరల్ జాన్ నికోల్సన్ స్పష్టం చేశారు. తాలిబన్ ఉగ్రవాదులకు పాకిస్తాన్లో కావలసినంత డ్రగ్స్, డబ్బూ లభిస్తోందని ఆయన చెప్పారు. తాలిబన్ ఉగ్రవాదులు పాకిస్తాన్లో క్షేమంగా తలదాచుకున్నారని ఆయన తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్నుంచి తాలిబన్లను ఏరేయడానికి అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న వ్యూహం సరైందేనని చెప్పారు. అయితే తాలిబన్లకు పాకిస్తానే ఆశ్రయం కల్పించడంతో.. పోరాటం కొనసాగించాల్సి వస్తోందని ఆయన చెప్పారు. ట్రంప్ న్యూ ఆఫ్ఘన్ పాలసీకి పాకిస్తాన్ అనుకూలమని ప్రకటించినా.. ఇప్పటివరకూ అమలు చేయలేదని ఆయన ప్రకటించారు.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







