పాకిస్తాన్...ఉగ్రవాదుల స్వర్గం
- November 30, 2017వాషింగ్టన్ : పాకిస్తాన్ ఉగ్రవాదుల స్వర్గమని మరోసారి అమెరికా పేర్కొంది. ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్నుంచి పారిపోయిన తాలిబన్లు.. పాకిస్తాన్లో క్షేమంగా ఉన్నారని ఆఫ్ఘనిస్తాన్లోని సంకీర్ణ బలగాల సైన్యాధికారి జనరల్ జాన్ నికోల్సన్ స్పష్టం చేశారు. తాలిబన్ ఉగ్రవాదులకు పాకిస్తాన్లో కావలసినంత డ్రగ్స్, డబ్బూ లభిస్తోందని ఆయన చెప్పారు. తాలిబన్ ఉగ్రవాదులు పాకిస్తాన్లో క్షేమంగా తలదాచుకున్నారని ఆయన తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్నుంచి తాలిబన్లను ఏరేయడానికి అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న వ్యూహం సరైందేనని చెప్పారు. అయితే తాలిబన్లకు పాకిస్తానే ఆశ్రయం కల్పించడంతో.. పోరాటం కొనసాగించాల్సి వస్తోందని ఆయన చెప్పారు. ట్రంప్ న్యూ ఆఫ్ఘన్ పాలసీకి పాకిస్తాన్ అనుకూలమని ప్రకటించినా.. ఇప్పటివరకూ అమలు చేయలేదని ఆయన ప్రకటించారు.
తాజా వార్తలు
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం