దుబాయ్ లో 'వేవ్' వారి బాలల దినోత్సవం !!
- November 14, 2015

Wave Resonance ఆధ్వర్యంలో గల్ఫ్ దేశాల్లోనే తొలిసారిగా బాలల దినోత్సవాన్ని శుక్రవారం సాయంత్రం దుబాయ్ లోని భారత రాయబార కార్యాలయం ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం ముంబాయికి చెందిన చిల్డ్రన్ ధియేటర్ సంస్థ నుండి 17 మంది విద్యార్ధులు ప్రత్యేక ప్రదర్శన కోసం విచ్చేశారు. చిల్డ్రన్ ధియేటర్ సంస్థ డైరెక్టర్ శ్రీ రాజు తులా మరియు ప్రొడ్యూసర్ మానస్ విలాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ విద్యార్ధుల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. సుధా విజయకుమార్ , దివ్య ఇస్నూరు స్కూల్ డ్రెస్ లో చేసిన వ్యాఖ్యానం సభికులని ఆకట్టుకుంది. ప్రశాంతి శ్రీనివాస్ స్కూల్ డ్రెస్ లో చేసిన స్కిట్ ఆహుతుల్ని నవ్వుల పూవుల్ని పూయించింది. రిత్విక్ అనే 4 ఏళ్ల చిన్నారి 130 దేశాల రాజధానుల పేర్లు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కార్యక్రమానికి విచ్చేసిన చిన్నారులంతా తమ తమ స్కిట్స్ ని వేదిక మీద ప్రదర్శించారు. దుబాయ్ లో షేక్ హమదాన్ అవార్డ్ అనేది విద్యార్ధులకి ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారం. ఈ సంవత్సరం ఈ అవార్డ్ పొందిన విద్యార్ధులకి అభినందనలతో పాటు చిరు సత్కారాన్ని అందించారు. అంతకుముందు వేవ్ రేసోనేన్సు ఫేస్ బుక్ పేజి లో నిర్వహించిన పిల్లల ఫోటో కాంటెస్ట్ లో మొదటిస్థానం పొందిన శ్రీవిద మరియు నిర్మిత , శ్రీరామ్ లకు బహుమతులు అందచేశారు. అలాగే వీడియో కాంటెస్ట్ లో మొదటి స్థానం పొందిన పొనిత్ మరియు విశాల్ , వివాన్ లకు కూడా బహుమతులు అందచేశారు. తొలిసారిగా నిర్వహించిన బాలల దినోత్సవం కావటంతో పిల్లలు , పెద్దలు మొత్తం 500 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఆహుతులంతా పిల్లల కోసం ఇంత చక్కటి కార్యక్రమాన్ని రూపొందించిన వేవ్ నిర్వాహకులు శ్రీ రావెళ్ళ రమేష్ బాబు , గీత దంపతులకు అభినందనలు తెలియచేశారు.
వేవ్ వారికి మాగల్ఫ్.కామ్ తరుపున ప్రత్యేక అభినందనలు.



తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







