కోహ్లీని ప్రశ్నించిన మిస్ వరల్డ్ మానుషి
- December 01, 2017
దిల్లీ: భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీకి మిస్ వరల్డ్ మానుషి ఛిల్లర్ ఓ ప్రశ్న వేశారు. తాజాగా దిల్లీలో 'సీఎన్ఎన్ న్యూస్ 18' అవార్డుల ప్రదానోత్సవంలో వీరిద్దరూ పాల్గొన్నారు. పాపులర్ ఛాయిస్ స్పెషల్ అఛీవ్మెంట్ పురస్కారాన్ని కోహ్లీ అందుకున్నాడు.
అనంతరం అక్కడే ఉన్న మానుషి మైక్ అందుకుని 'కోహ్లీ మొదటగా అవార్డు అందుకున్న నీకు శుభాకాంక్షలు. ఈ సందర్భంగా నిన్ను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ప్రపంచంలోనే బ్యాట్స్మెన్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నావు. ఎందరో యువ క్రికెటర్లు నిన్ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతున్నారు. వీరికి నువ్వు ఇచ్చే సలహాలు, సూచనలు ఏమిటి. ముఖ్యంగా చిన్నారులకు' అని ప్రశ్నించారు.
దీనికి కోహ్లీ 'ఆటలో ఎప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది ఇక్కడ చాలా ముఖ్యం. ఈ ఆలోచన నీ గుండెల్లోంచి రావాలి. మైదానంలో నువ్వు ఏంటో నిరూపించుకోగలగాలి. లేదంటే నువ్వు అభిమానుల హృదయాలను గెలుచుకోలేవు. నేను మరొకరిలా ఉండాలని ఎప్పుడూ ప్రయత్నించను. నేను ఎప్పుడు నాలాగే ఉంటాను. నా తీరుపై ఎవరికి ఎలాంటి అభ్యంతరాలున్నా వాటి గురించి నేను పట్టించుకోను' అని బదులిచ్చాడు.
అనంతరం మానుషి 'ప్రత్యేక అఛీవ్మెంట్' అవార్డును కోహ్లీ చేతులమీదుగా అందుకున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష