పైలట్‌ లేని కారణంగా నిలిచిన విమానం.!

- December 02, 2017 , by Maagulf
పైలట్‌ లేని కారణంగా నిలిచిన విమానం.!

పైలట్‌ లేకపోవడంతో విమానం దాదాపు ఏడు గంటల పాటు ఆలస్యమైంది. దీంతో విసిగిపోయిన ప్రయాణికులు ముంబయిలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆందోళనకు దిగారు. ముంబయి నుంచి అహ్మదాబాద్‌ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం శనివారం తెల్లవారుజామున బయలుదేరాల్సి ఉంది. అయితే.. సమయానికి పైలట్‌ లేకపోవడంతో విమానం ఆలస్యమైంది. దాదాపు ఏడు గంటల పాటు ప్రయాణికులు విమానాశ్రయంలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కనీసం వేచి ఉండేందుకు వసతి, తినడానికి ఆహారం కూడా ఇవ్వకుండా ఎయిరిండియా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ 200 మంది ప్రయాణికులు ఆందోళనకు దిగారు. తొలుత విమానం గంట ఆలస్యంగా బయలుదేరుతుందని చెప్పారు. కానీ తర్వాత విమానం నడిపేందుకు పైలట్‌ అందుబాటులో లేరని చెప్పి ఏడు గంటలు ఆలస్యం చేసినట్లు ప్రయాణికులు తెలిపారు. ఉదయం 9 గంటల సమయంలో పైలట్‌ రావడంతో విమానం బయలుదేరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com