మెగా ఉద్యోగమేళా ముగింపు వేడుకలు.. 1087 మందికి ఉద్యోగాలు..!!

- December 02, 2017 , by Maagulf
మెగా ఉద్యోగమేళా ముగింపు వేడుకలు.. 1087 మందికి ఉద్యోగాలు..!!

ప్రపంచపటంలో ఏపీ ఒక బ్రాండ్‌గా నిలవడానికి రాష్ట్ర యువతే కారణమన్నారు సీఎం చంద్రబాబు. విజయవాడలో జరిగిన మెగా ఉద్యోగమేళా ముగింపు వేడుకలకు హాజరై తెలుగు యువతపై ప్రశంసలు కురిపించారు. 2019 నాటికి ఐటీలో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారు. విజయవాడలోని ఎ-కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన మెగా ఉద్యోగా మేళా ముగింపు వేడుకలకు సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ప్రపంచ పటంలో ఏపీ ఒక బ్రాండ్‌గా నిలబడటానికి.. రాష్ట్ర యువత తెలివితేటలు, తన మార్కెటింగ్ నైపుణ్యమే కారణమన్నారు సీఎం. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు అత్యంత తెలివైనవారన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్ కూడా యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఐటీ ద్వారా 2019 నాటికి లక్ష మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. 
సమాచార సాంకేతిక అకాడమీ ఆధ్వర్యంలో ఈ మెగా ఉద్యోగమేళా వారం రోజుల పాటు జరిగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేల మంది యువకులు ఈ జాబ్ మేళాకు తరలివచ్చారు. వారిలో 1087 మందికి అధికారులు ఉద్యోగాలు కల్పించారు. రాష్ట్ర యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందించిన కంపెనీల ప్రతినిధులను సీఎం సన్మానించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com