ముఖేష్ అంబానీ మాటలకు నెట్టింట్లో కామెంట్లు
- December 03, 2017
అవును.. సోషల్ మీడియాలో ఇవాళ ఇదే ట్రెండింగ్ టాపిక్. అసలు మిమ్మల్ని డబ్బడిగేదెవరంటూ ఒకటే కామెంట్లు. ఇంతకీ ఈ వ్యాఖ్యలన్నీ ఎవరిగురించి, ఏ పోస్ట్ గురించి అంటే. ఇంకెవరు.. ఒన్ అండ్ ఓన్లీ ఇండియాస్ రిచ్చెస్ట్ మ్యాన్ ముఖేష్ అంబానీ. ఇవాళ ముఖేష్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. తన వద్ద క్రెడిట్ కార్డు కూడా లేదని, తనకు డబ్బు ముఖ్యం కాదని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ పేర్కొనడమే దీనికి కారణం.
ముంబయిలో జరిగిన హిందుస్థాన్ టైమ్స్ లీడర్ పిష్ సదస్సులో ఫస్ట్ టైం వ్యక్తిగత విషయాలను ఆయన ప్రస్తావించారు. తాను డబ్బు గురించి ఆలోచించే వ్యక్తిని కాదని.. డబ్బుకన్నా తనకు వనరులే ఇంపార్టెంట్ అన్నారు. తను ఎక్కడికైనా వెళ్లినప్పుడు మరోకరు డబ్బులు చెల్లిస్తారన్నారు. 2024 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ రెట్టింపు అవుతుందన్నారు.
ముఖేష్ చేసిన ఈ వ్యాఖ్యలపైనే సోషల్ మీడియాలో కామెంట్లు పడిపోతున్నాయి. ఏవస్తువైనా మీరు కొనాల్సిన అవసరం ఏముంది? ఒక వేళ కొంటే గింటే, మిమ్మల్ని డబ్బులడిగేదెవరని అంటున్నారు. అడుగుబయటకి పెడితే మందీమార్బలం మీవెంట ఉంటే..మీకు క్రెడిట్ కార్డులెందుకని ఇంకొందరంటున్నారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు







