ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- December 03, 2017
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కాపు రిజర్వేషన్లు, బీసీ సంఘాల ఆందోళన నేపథ్యంలో ప్రజా ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. మంజునాథ్ వివాదంపైనా నేతలకు సూచనలు చేశారు. అంతా సమన్వయం చేసుకోవాలని, కళా వెంకట్రావ్, అచ్చెన్నాయుడు, టీడీ జనార్ధన్లకు బాధ్యతలు అప్పగించారు. ఏ వర్గానికీ అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించామన్నారు. రిజర్వేషన్పై చాలా కాలంగా ఉన్న డిమాండ్ను నెరవేర్చామన్నారు చంద్రబాబు. నిబంధనల ప్రకారమే కాపు రిజర్వేషన్ల బిల్లును సభలో ప్రవేశపెట్టామన్నారు. బీసీ కమిషన్లోని మెజార్టీ సభ్యుల నివేదిక ఆధారంగా కాపు రిజర్వేషన్లపై నిర్ణయించామన్నారు. అయితే బీసీలకు రిజర్వేషన్లలో కోత పెట్టలేదన్నారు సీఎం. కొన్ని పార్టీలు రాజకీయ లబ్ది కోసం కులాలను రెచ్చగొడుతున్నాయని, టీడీపీ హయాంలోనే బీసీల అభ్యున్నతి జరిగిందని గుర్తు చేశారు. బీసీలను, కాపులను టీడీపీ ఎన్నడూ ఓటు బ్యాంకుగా చూడలేదన్నారు చంద్రబాబు. ఇదే సమయంలో బీసీ సంఘ నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య చేసిన విమర్శలను పలువురు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







