విశాల్ ఎంట్రీతో హీటెక్కిన ఆర్కేనగర్ బైపోల్
- December 03, 2017
తమిళనాట ఆర్కేనగర్ ఉపఎన్నిక వేడి తారాస్థాయికి చేరింది. విశాల్ ఎంట్రీతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. తొలుత అధికార, విపక్షాల మధ్య గట్టిపోటీ వుంటుందని పార్టీలు భావించినప్పటికీ.. విశాల్ రాకతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. సోమవారం ఉదయం చెన్నైలోని తన మద్దతుదారులతో కలిసి ఓ టెంపుల్కి వెళ్లి అక్కడ ఆశీస్సులు తీసుకుని అక్కడి నుంచి దివంగత మాజీ ముఖ్యమంత్రులైన కామరాజ్, ఎంజీఆర్, జానకీ రామచంద్రన్ విగ్రహాలను పూలమాల వేశాడు. అనంతరం ఆర్కేనగర్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నాడు.
కొన్నాళ్లగా తమిళనాట వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు నటుడు విశాల్. ఇటీవల నడిఘర్ సంఘం ఎన్నికలు.. విశాల్ రాకతో పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. అక్కడ సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నాడు.
ఇదే స్పీడ్ ఆర్కేనగర్ బైపోల్లో కొనసాగిస్తాడా? రాజకీయాలు వేరు.. సినిమాలు వేరని ఓటర్లు నిరూపిస్తారో చూడాలి. ఇక విశాల్కి ధీటుగా బరిలోకి దిగేందుకు దర్శకుడు, నటుడు అమీర్. ఆయన కూడా స్వతంత్ర అభ్యర్థిగా సోమవారం నామినేషన్ దాఖలు వేయనున్నాడు. అధికార అన్నాడీఎంకే అభ్యర్థిగా మదుసూదనన్, డీఎంకే అభ్యర్థిగా మరుదుగణేశ్, అన్నాడీఎంకే అమ్మ (రెబల్) గా టీటీవీ దినకరన్ పోటీ చేస్తుండగా, ఇక బీజేపీ అభ్యర్థి కరు నాగరాజన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల