అడ్డంగా బుక్ అయిన పేటీఎం ఫౌండర్
- December 04, 2017
నగదు లావాదేవీల్లో డిజిటలీకరణ ఉద్యమానికి ఆదిగురువుగా చెప్పుకునే పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ.. ఇప్పుడు అడ్డంగా దొరికిపోయాడు. అలాగని ఏదైనా దోపిడీకి, దురాగతానికీ పాల్పడలేదు. జస్ట్.. ఒక చిన్న ఓవరాక్షన్ వల్లే సోషల్ మీడియా బోనులో దోషిలా నిలబడాల్సి వచ్చిందాయన. ఇంతకీ ఆ పెద్దమనిషి చేసిన ఘనకార్యం ఏమిటంటే.. 'భారత సాయుధ దళాల ఫ్లాగ్ డే ఫండ్'కి ఇప్పుడే రూ. 501 డొనేట్ చేశా' అంటూ ఆన్ లైన్ పేమెంట్ స్క్రీన్ షాట్ తో సహా ట్వీట్ చేశాడు. సగర్వంగా ఇలా ప్రకటించుకున్నాడో లేదో అలా నెటిజన్ల నుంచి ఎదురుదాడి మొదలైంది.
భారత జవాన్లను 'గొప్ప'గా ఆదుకున్నందుకు అభినందనలు అంటూ ట్విట్టర్లో ఫాలోయర్లంతా సెటైర్లేయడం మొదలుపెట్టేశారు. ''ఢిల్లీలో 100 కోట్ల ఖరీదైన భవనంలో నివాసముంటున్న ఒక పేటీఎం పెద్దమనిషి.. భారత సాయుధ జవాన్ల సంక్షేమం కోసం రూ. 501 విరాళమిచ్చి తన పెద్ద మనసు చాటుకున్నారు'' అంటూ మొహంమీద ఉమ్మేసినంత పని జరుగుతోందక్కడ. 'పేటీఎం కరో' అనేది ఆయన సొంత బ్రాండ్ స్లోగన్.
దీన్ని ప్రమోట్ చేసుకోడానికి పెట్టిన ఒకేఒక్క ట్వీట్.. ఆయన్ను తీసుకొచ్చి ఇలా బజార్న పడేసింది. జనంలో స్ఫూర్తి నింపడంతో పాటు సొంత కంపెనీ ప్రమోషన్ కూడా జరిగినట్లవుతుందని ఆశపడ్డందుకు పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మకు బాగానే అయ్యింది.
తాజా వార్తలు
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్