గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- September 17, 2025
రియాద్: గాజాలో జరిగిన మారణహోమ నేరాలకు ఇజ్రాయెల్ను తప్పబట్టింది ఐక్యరాజ్యసమితి స్వతంత్ర అంతర్జాతీయ విచారణ కమిషన్. ఈ కమిషన్ జారీ చేసిన నివేదికలోని ఫలితాలను సౌదీ అరేబియా స్వాగతించింది. గాజా స్ట్రిప్లో నిరాయుధ పౌరులపై ఇజ్రాయెల్ సాయుధ దళాలు విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతూ మారణహోమ నేరాలకు పాల్పడుతున్నట్లు నివేదికలో వెల్లడించారు.
కాగా, ఈ నివేదిక పాలస్తీనా ప్రజలు ఎదుర్కొంటున్న నేరాలు, ఉల్లంఘనలను స్పష్టంగా ప్రపంచ దేశాలకు తెలియజేస్తున్నాయని సౌదీ అరేబియా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయ తీర్మానాలను అమలు చేయడానికి, రెండు దేశాల ఏర్పాటుతో పరిష్కారాన్ని అమలు చేయడానికి మరియు పాలస్తీనా ప్రజల కష్టాలను దూరం చేసేందుకు శాశ్వతమైన చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజానికి సౌదీ అరేబియా మరోసారి పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







