గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- September 17, 2025
రియాద్: గాజాలో జరిగిన మారణహోమ నేరాలకు ఇజ్రాయెల్ను తప్పబట్టింది ఐక్యరాజ్యసమితి స్వతంత్ర అంతర్జాతీయ విచారణ కమిషన్. ఈ కమిషన్ జారీ చేసిన నివేదికలోని ఫలితాలను సౌదీ అరేబియా స్వాగతించింది. గాజా స్ట్రిప్లో నిరాయుధ పౌరులపై ఇజ్రాయెల్ సాయుధ దళాలు విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతూ మారణహోమ నేరాలకు పాల్పడుతున్నట్లు నివేదికలో వెల్లడించారు.
కాగా, ఈ నివేదిక పాలస్తీనా ప్రజలు ఎదుర్కొంటున్న నేరాలు, ఉల్లంఘనలను స్పష్టంగా ప్రపంచ దేశాలకు తెలియజేస్తున్నాయని సౌదీ అరేబియా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయ తీర్మానాలను అమలు చేయడానికి, రెండు దేశాల ఏర్పాటుతో పరిష్కారాన్ని అమలు చేయడానికి మరియు పాలస్తీనా ప్రజల కష్టాలను దూరం చేసేందుకు శాశ్వతమైన చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజానికి సౌదీ అరేబియా మరోసారి పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్ఫ్లుయెన్సర్
- పెయింటింగ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారి ప్రవ్య అదిత్రి
- చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్
- ఘనంగా విశ్వగురు వరల్డ్ రికార్డు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ వేడుక
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!









