గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- September 17, 2025
రియాద్: గాజాలో జరిగిన మారణహోమ నేరాలకు ఇజ్రాయెల్ను తప్పబట్టింది ఐక్యరాజ్యసమితి స్వతంత్ర అంతర్జాతీయ విచారణ కమిషన్. ఈ కమిషన్ జారీ చేసిన నివేదికలోని ఫలితాలను సౌదీ అరేబియా స్వాగతించింది. గాజా స్ట్రిప్లో నిరాయుధ పౌరులపై ఇజ్రాయెల్ సాయుధ దళాలు విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతూ మారణహోమ నేరాలకు పాల్పడుతున్నట్లు నివేదికలో వెల్లడించారు.
కాగా, ఈ నివేదిక పాలస్తీనా ప్రజలు ఎదుర్కొంటున్న నేరాలు, ఉల్లంఘనలను స్పష్టంగా ప్రపంచ దేశాలకు తెలియజేస్తున్నాయని సౌదీ అరేబియా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయ తీర్మానాలను అమలు చేయడానికి, రెండు దేశాల ఏర్పాటుతో పరిష్కారాన్ని అమలు చేయడానికి మరియు పాలస్తీనా ప్రజల కష్టాలను దూరం చేసేందుకు శాశ్వతమైన చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజానికి సౌదీ అరేబియా మరోసారి పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక