గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- September 17, 2025
రియాద్: గాజాలో జరిగిన మారణహోమ నేరాలకు ఇజ్రాయెల్ను తప్పబట్టింది ఐక్యరాజ్యసమితి స్వతంత్ర అంతర్జాతీయ విచారణ కమిషన్. ఈ కమిషన్ జారీ చేసిన నివేదికలోని ఫలితాలను సౌదీ అరేబియా స్వాగతించింది. గాజా స్ట్రిప్లో నిరాయుధ పౌరులపై ఇజ్రాయెల్ సాయుధ దళాలు విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతూ మారణహోమ నేరాలకు పాల్పడుతున్నట్లు నివేదికలో వెల్లడించారు.
కాగా, ఈ నివేదిక పాలస్తీనా ప్రజలు ఎదుర్కొంటున్న నేరాలు, ఉల్లంఘనలను స్పష్టంగా ప్రపంచ దేశాలకు తెలియజేస్తున్నాయని సౌదీ అరేబియా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయ తీర్మానాలను అమలు చేయడానికి, రెండు దేశాల ఏర్పాటుతో పరిష్కారాన్ని అమలు చేయడానికి మరియు పాలస్తీనా ప్రజల కష్టాలను దూరం చేసేందుకు శాశ్వతమైన చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజానికి సౌదీ అరేబియా మరోసారి పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









