రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!

- September 17, 2025 , by Maagulf
రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!

కవైట్: కువైట్ విమానాశ్రయాల గుండా వెళుతున్నప్పుడు క్యాష్, బంగారం, జువెలరీ, ఇతర విలువైన వస్తువులను ప్రకటించాల్సిన రూల్స్ గురించి కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ మరోసారి ప్రయాణికులకు గుర్తు చేసింది.

ప్రస్తుత నిబంధనల ప్రకారం, 3,000 కువైట్ దినార్లు లేదా అంతకంటే ఎక్కువ నగదు లేదా విదేశీ కరెన్సీలో దానికి సమానమైన నగదును తీసుకెళ్లే ప్రయాణీకులను అనుమతిస్తారు. ప్రయాణ సమయంలో కస్టమ్స్ డిక్లరేషన్ ఫారమ్‌ను ద్వారా ప్రకటించాలి.

ఇక దేశం విడిచి వెళ్ళేటప్పుడు గోల్డ్, జ్యువెలరీ మరియు విలువైన గడియారాలు సహా - అన్ని రకాల బంగారాన్ని కూడా ప్రకటించాలని మంత్రిత్వ సూచించింది. బంగారు బులియన్ కోసం, T4 భవనం సమీపంలో ఎయిర్ కార్గో విభాగం ఒక పత్రాన్ని జారీ చేస్తుంది. డిక్లరేషన్ ప్రక్రియ అనేది మనీలాండరింగ్ మరియు ఉగ్రవాదులకు నిధులు అందకుండా రూపొందించబడిన చట్టపరమైన రూల్స్ అని, ఇది ప్రయాణీకుల ప్రయాణ స్వేచ్ఛను పరిమితం చేయదని అధికారులు స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com