రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- September 17, 2025
మస్కట్: ఒమన్ ఎయిర్ 2025లో అత్యంత రద్దీగా ఉండే ఖరీఫ్ సీజన్ను రికార్డులతో ముగించింది. జూన్ ప్రారంభం నుండి ఆగస్టు చివరి వరకు రెండు లక్షల కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఒమన్ ఎయిర్ లో సలాలాకు ప్రయాణించారు. గతేడాది కంటే ప్రయాణికుల సంఖ్య 15శాతం పెరిగింది. ఒమన్ పర్యాటక రంగానికి మద్దతుగా.. దేశీయ ప్రయాణాన్ని సులభతరం చేసినట్టు ఒక ప్రకటనలో ఒమన్ ఎయిర్ వెల్లడించింది.
ఖరీఫ్ సమయంలో 70% కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఒమన్ ఎయిర్ ను ఎంచుకున్నారని, OMR 54 రిటర్న్ ఛార్జీ ఆఫర్ కూడా ఒమన్ ఎయిర్ రికార్డు నమోదులో కీలక పాత్ర పోషిందన్నారు. కాగా OMR 64 ఛార్జీ ఏడాది పొడవునా అందుబాటులో ఉంటుందని, ఇది సలాలా మరియు మస్కట్ మధ్య ప్రయాణించేవారు దాని నుంచి లాభం పొందాలని ఒమన్ ఎయిర్ గ్లోబల్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ అహ్మద్ అల్ మహరూకి తెలిపారు. రాబోయే రోజుల్లోనూ ఒమన్ సాంస్కృతిక మరియు సహజ వారసత్వాన్ని ప్రోత్సహిస్తామని, ఇన్బౌండ్ పర్యాటకాన్ని పెంచడానికి ముందు వరుసలో ఉంటామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









