రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- September 17, 2025
మస్కట్: ఒమన్ ఎయిర్ 2025లో అత్యంత రద్దీగా ఉండే ఖరీఫ్ సీజన్ను రికార్డులతో ముగించింది. జూన్ ప్రారంభం నుండి ఆగస్టు చివరి వరకు రెండు లక్షల కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఒమన్ ఎయిర్ లో సలాలాకు ప్రయాణించారు. గతేడాది కంటే ప్రయాణికుల సంఖ్య 15శాతం పెరిగింది. ఒమన్ పర్యాటక రంగానికి మద్దతుగా.. దేశీయ ప్రయాణాన్ని సులభతరం చేసినట్టు ఒక ప్రకటనలో ఒమన్ ఎయిర్ వెల్లడించింది.
ఖరీఫ్ సమయంలో 70% కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఒమన్ ఎయిర్ ను ఎంచుకున్నారని, OMR 54 రిటర్న్ ఛార్జీ ఆఫర్ కూడా ఒమన్ ఎయిర్ రికార్డు నమోదులో కీలక పాత్ర పోషిందన్నారు. కాగా OMR 64 ఛార్జీ ఏడాది పొడవునా అందుబాటులో ఉంటుందని, ఇది సలాలా మరియు మస్కట్ మధ్య ప్రయాణించేవారు దాని నుంచి లాభం పొందాలని ఒమన్ ఎయిర్ గ్లోబల్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ అహ్మద్ అల్ మహరూకి తెలిపారు. రాబోయే రోజుల్లోనూ ఒమన్ సాంస్కృతిక మరియు సహజ వారసత్వాన్ని ప్రోత్సహిస్తామని, ఇన్బౌండ్ పర్యాటకాన్ని పెంచడానికి ముందు వరుసలో ఉంటామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక









