" అజ్ఞాతవాసి " మిస్ అవుతున్న సీనియర్ నటి ఖుష్బూ

- December 04, 2017 , by Maagulf

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం " అజ్ఞాతవాసి " లో తన రోల్ కు సంబంధించిన షూటింగ్ పూర్తయిందని అన్నారు సీనియర్ నటి ఖుష్బూ. యూనిట్ సభ్యులను విడిచివెళ్ళడం బాధగా ఉందంటూ..దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి దిగిన సెల్ఫీని ఆమె ట్విటర్ లో పోస్ట్ చేశారు. కొందరిని విడిచి వెళ్తూ గుడ్ బై చెప్పాలంటే బాధగా ఉంటుంది. అలాంటివారే ఈ మూవీ సభ్యులు. నా చివరి షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్నా. ఇంత మంచివారికి వీడ్కోలు చెప్పి వెళ్తుంటే నా కళ్ళు చెమర్చాయి. ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని కోరుతున్నా అని ఖుష్బూ ట్వీట్ చేశారు. ప్రత్యేకంగా త్రివిక్రమ్ తో కలిసి పని చేయడం సంతోషంగా ఉందని, అలాగే.. సహ నటుడు పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలని ఆమె పేర్కొన్నారు. వచ్చే సంక్రాంతి పండుగకు ఈ చిత్రం విడుదల కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com