ఉగ్ర పోరు కొనసాగుతుంది: ఆర్మీ చీఫ్‌

- December 05, 2017 , by Maagulf
ఉగ్ర పోరు కొనసాగుతుంది: ఆర్మీ చీఫ్‌

సూరత్‌గఢ్‌(రాజస్థాన్‌): కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని నిర్మూలించే చర్యలు కొనసాగుతూనే ఉంటాయని ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ స్పష్టంచేశారు. రాజస్థాన్‌లోని సూరత్‌గఢ్‌ మిలటరీ స్టేషన్‌ను సందర్శించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కశ్మీర్‌లో ఉగ్రవాదులను ఏరివేత చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి మెరుగుపడిందన్నారు. భవిష్యత్‌లోనూ ఈ ఆపరేషన్‌ కొనసాగుతుందన్నారు.

ఈ ఏడాది జమ్ముకశ్మీర్‌లో మొత్తం 200 మంది ఉగ్రవాదులను ఏరివేసినట్లు చెప్పారు. 2010 తర్వాత ఒకే సంవత్సరంలో ఇంతమంది మట్టుబెట్టడం ఇదే తొలిసారి తెలిపారు. పొరుగుదేశం ఉగ్ర సంస్థలతో కుమ్మక్కవుతుందని పాక్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. భారత్‌ మాత్రం ఎప్పటికీ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటుందని స్పష్టంచేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com