ప్రపంచ ఆలోచనాపరుల జాబితాలో అగ్రస్థానం లో నిలిచిన కమలా హ్యారిస్
- December 05, 2017
వాషింగ్టన్: 'ప్రపంచ అత్యుత్తమ ఆలోచనాపరుల జాబితా'లో.. భారతీయ అమెరికన్ కమలా హ్యారిస్ అగ్రస్థానం సాధించారు. ప్రఖ్యాత 'ఫారిన్ పాలసీ' మ్యాగజైన్ 2017కు గానూ 50 మంది పేర్లతో కూడిన ఈ జాబితాను ప్రకటించింది. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ పాలన సాగుతున్న సమయంలో.. ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీకి కమలా ఆశాజ్యోతిగా నిలిచారంటూ మ్యాగజైన్ వర్ణించింది. ప్రస్తుతం కమలా కాలిఫోర్నియా రాష్ట్రానికి సెనేటర్గా ఉన్నారు. ఇటు భారత సంతతికి చెందిన హాస్యకారుడు హసన్ మిన్హాజ్, రాజకీయ నాయకురాలు నిక్కీ హేలీలు కూడా ఈ జాబితాలో చోటు సంపాదించారు. హసన్కు జాబితాలో మూడో స్థానం దక్కింది.
అంతర్జాతీయ వ్యవహారాల పట్ల అమెరికా సంప్రదాయ దార్శనికతను హేలీ కాపాడుతున్నారని 'ఫారిన్ పాలసీ' కొనియాడింది. ఐరాసకు అమెరికా రాయబారిగా నియమితురాలైన హేలీ.. అధ్యక్ష కేబినెట్లో సభ్యత్వం దక్కించుకున్న తొలి భారతీయ అమెరికన్గా ఘనత సాధించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి