జోస్యంతో పాక్ ను హడలెత్తిస్తున్న భారతీయుడు
- December 05, 2017
దిల్లీ: పాకిస్థాన్లో ఫలానా సమయంలో దాడులు జరుగుతాయంటూ ఓ జ్యోతిష్కుడు చేసిన ట్వీట్లకు.. ఆ దేశ ఎంపీలు బెంబేలెత్తుతున్నారు. ఇదే సాకుగా తమ దేశంలో జరుగుతున్న దాడుల వెనుక భారత్ హస్తముందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. అనిరుధ్కుమార్ మిశ్ర అనే పేరుతో ఓ వ్యక్తి ట్విటర్లో జోస్యాలు చెబుతున్నారు. విపత్తులు, ఎన్నికలు, స్టాక్మార్కెట్లు, ఉగ్రదాడులు సహా వివిధ అంశాలకు సంబంధించిన పరిణామాలపై ముందుగానే అంచనాలు వేస్తున్నారు. నవంబర్లో పాక్లో ఉగ్రదాడులు జరగొచ్చని హెచ్చరిస్తూ అక్టోబర్లోనే ఆయన ట్వీట్చేశారు. అయితే డిసెంబర్ 1న పెషావర్లో ఉగ్రవాదులు దాడి చేసి 13మందిని బలితీసుకున్నారు. దీంతో ఘటనపై ఓ భారతీయుడు అటూఇటుగా అంచనా వేయగలిగాడని.. ఇదెలా సాధ్యమైందని పాక్ అంతర్గతమంత్రిని ఆ దేశ ఎంపీలు వివరణ కోరారు. ఇటు ఫిబ్రవరి ముగిసేలోపు పాక్లో ఐదు దాడులు జరుగుతాయంటూ అనిరుధ్కుమార్ ఇంకో ట్వీట్చేయడం గమనార్హం.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి