జోస్యంతో పాక్ ను హడలెత్తిస్తున్న భారతీయుడు
- December 05, 2017
దిల్లీ: పాకిస్థాన్లో ఫలానా సమయంలో దాడులు జరుగుతాయంటూ ఓ జ్యోతిష్కుడు చేసిన ట్వీట్లకు.. ఆ దేశ ఎంపీలు బెంబేలెత్తుతున్నారు. ఇదే సాకుగా తమ దేశంలో జరుగుతున్న దాడుల వెనుక భారత్ హస్తముందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. అనిరుధ్కుమార్ మిశ్ర అనే పేరుతో ఓ వ్యక్తి ట్విటర్లో జోస్యాలు చెబుతున్నారు. విపత్తులు, ఎన్నికలు, స్టాక్మార్కెట్లు, ఉగ్రదాడులు సహా వివిధ అంశాలకు సంబంధించిన పరిణామాలపై ముందుగానే అంచనాలు వేస్తున్నారు. నవంబర్లో పాక్లో ఉగ్రదాడులు జరగొచ్చని హెచ్చరిస్తూ అక్టోబర్లోనే ఆయన ట్వీట్చేశారు. అయితే డిసెంబర్ 1న పెషావర్లో ఉగ్రవాదులు దాడి చేసి 13మందిని బలితీసుకున్నారు. దీంతో ఘటనపై ఓ భారతీయుడు అటూఇటుగా అంచనా వేయగలిగాడని.. ఇదెలా సాధ్యమైందని పాక్ అంతర్గతమంత్రిని ఆ దేశ ఎంపీలు వివరణ కోరారు. ఇటు ఫిబ్రవరి ముగిసేలోపు పాక్లో ఐదు దాడులు జరుగుతాయంటూ అనిరుధ్కుమార్ ఇంకో ట్వీట్చేయడం గమనార్హం.
తాజా వార్తలు
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్







