ఇటలీలో పెళ్లిచేసుకోనున్న విరాట్ - అనుష్క.!
- December 06, 2017టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్తార అనుష్క శర్మ ఒక్కటి కాబోతున్నారు. వీరిద్దరి మధ్య చాలా రోజులుగా సాగుతున్న ప్రేమాయణం ఎట్టకేలకు పరిణయంగా మారనుంది. వచ్చేవారం ఇటలీలో అంగరంగ వైభవంగా పెళ్లివేడుక నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా జరిగిపోయని ప్రచారం వినిపిస్తోంది.
9 నుంచి 12వ తేదీ దాకా నాలుగు రోజుల పాటు వివాహ వేడుకలు జరుగుతాయని, ఇందుకు ఇటలీలోని మిలాన్ నగరం వేదిక కాబోతోందని వినికిడి. పెళ్లివేడుక ఘనంగా జరుగుతుంది, మిత్రులు, సన్నిహితులను మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరవుతారని ఇదివరకు వార్తలు వచ్చాయి. ఈ యేడాది ప్రారంభంలోనే డిసెంబర్ ముహూర్తాన్ని నిర్ణయించారన్న కథనాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అటు కోహ్లీ గానీ, ఇటు అనుష్క శర్మ వైపునుంచి గానీ అధికారిక ప్రకటన రాలేదు.
ఇదిలావుండగా, అనుష్క తరఫు ప్రతినిధి పెళ్లి వార్తను కొట్టిపారేశారు. ఇందులో నిజం లేదని, ఒట్టి పుకార్లేనని తేల్చిచెప్పాడు. కాగా, వారం రోజుల కిందట జరిగిన జహీర్ఖాన్ పెళ్లి వేడుకలో వీళ్లిద్దరు డ్యాన్స్ చేసి అలరించారు. అంతేకాదు, ఆర్పీ-ఎస్జీ గ్రూప్ పేరుతో క్రీడాకారులకు పురస్కారాలు అందించే కార్యక్రమాన్ని కోహ్లీ ప్రారంభించగా, ఇందుకు అనుష్క పూర్తిమద్దతు తెలిపింది. 2013 నుంచి వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని విరాట్ కోహ్లీ బహిరంగంగానే ప్రకటించాడు కూడా. కోహ్లీ ఆటను చూసేందుకు అనుష్కశర్మ దేశ, విదేశాలకు వెళ్లిన సందర్భాలూ ఉన్నాయి.
తాజా వార్తలు
- ఒమన్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లకు మంచి రోజులు..!
- జహ్రా గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 66కు పెరిగిన సౌదీ ఇ-విజిట్ వీసా పూల్ దేశాలు
- దుబాయ్లో కొత్త ట్రాఫిక్ ప్లాన్ కు ఆమోదం
- క్యాబిన్ క్రూ సంక్షోభం.. తగ్గనున్న ఎయిర్ ఇండియా సర్వీసులు..!
- షేక్ హజ్జా బిన్ సుల్తాన్ బిన్ జాయెద్ మృతికి సంతాపం తెలిపిన యూఏఈ ప్రెసిడెంట్
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!
- 'డార్క్ స్కై పాలసీ' ప్రకటించిన అబుదాబి
- ఎజార్: రెంటర్స్ నుండి ప్రాపర్టీ హామీ తప్పనిసరి..!
- విమాన ప్రమాదాల బాధితులకు సహాయం.. ప్రమాణాలపై అంతర్జాతీయ సదస్సు