మద్యం సేవించడానికి వయోపరిమితి పెంచనున్న కేరళ ప్రభుత్వం
- December 07, 2017కేరళలో మద్యం సేవించడానికి వయోపరిమితిని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 21 ఏళ్ల పరిమితిని 23 ఏళ్లకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆబ్కారీ చట్టంలో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ తీసుకు రావడానికి కేరళ ప్రభుత్వం సమాయత్తమైంది. మద్యం సేవించే వారి వయోపరిమితిని పెంచుతామని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డిఎఫ్) తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. దీనికి అనుగుణంగా మంత్రివర్గం నిర్ణయం తీసుకుని, ఆర్డినెన్స్ ముసాయిదాను రూపొందించాల్సిందిగా ఆదేశిస్తూ న్యాయశాఖకు పంపింది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..