కారులో మృతి చెందిన వ్యక్తి
- December 07, 2017
మనామా: ఓ వ్యక్తి కారులో మృతి చెందిన ఘటన బిలాద్ అల్ కదీమ్లోని ఓ మాస్క్ సమీపంలో చోటు చేసుకుంది. మృతుడు కారుని, మసీదు పక్కనే పార్క్ చేసినట్లు సీసీటీవీ విజువల్స్లో తేటతెల్లమవుతోంది. కారులో వ్యక్తిని గుర్తించిన కొందరు, పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు వచ్చి చూసేసరికి అతను మృతి చెంది ఉన్నాడు. కారు ఇంజిన్ అప్పటికీ రన్నింగ్ కండిషన్లో ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నలభయ్యేళ్ళ వ్యక్తి కారులో ఉండి, లాక్ చేసుకున్నట్లు ఓ ప్రత్యక్ష సాక్షి వివరించారు. మృతుడ్ని రెస్టారెంట్ ఓనర్ ఒకరు ముందుగా గుర్తించడం జరిగింది. రాత్రి 9.58 నిమిషాల సమయంలో కారు అక్కడ ఆగిందనీ, ఉదయం వరకూ కారు అక్కడే ఉండిపోయిందని రెస్టారెంట్ ఓనర్ తెలిపారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







