మహిళల్ని కెమెరాలో చిత్రీకరించిన వ్యక్తిపై కేసు నమోదు
- December 07, 2017
గల్ఫ్ జాతీయుడైన యువకుడొకరు, తన కెమెరాలో మహిళల్ని చిత్రీకరించి ఆ విజువల్స్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంఘటన వెలుగు చూసింది. బాధిత మహిళ, ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ రస్ అల్ ఖమా మిస్డెమీనర్ కోర్టులో జరుగుతోంది. బాధిత మహిళల అనుమతి లేకుండా వారిని కెమెరాలో చిత్రీకరించినట్లు న్యాయస్థానానికి తెలిపారు పోలీసులు. అయితే తన మీద వచ్చిన ఆరోపణల్ని నిందితుడు అంగీకరించడంలేదు. ఆ ఇద్దరు మహిళలూ తనకు తెలుసనీ, వారి అనుమతితోనే వారిని వీడియో తీయడం జరిగిందని నిందితుడు అంటున్నాడు. సోషల్ మీడియాలో వీడియోను ఓ మహిళ భర్త చూడటం, ఆమెపై ఆ భర్త ఆగ్రహానికి గురవడంతో, ఆమె పోలీసులను ఆశ్రయించి, తనపై అక్రమంగా కేసు బనాయించినట్లు నిందితుడు విచారణలో పోలీసులకు తెలిపినట్లు సమాచారమ్.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







