మహిళల్ని కెమెరాలో చిత్రీకరించిన వ్యక్తిపై కేసు నమోదు
- December 07, 2017
గల్ఫ్ జాతీయుడైన యువకుడొకరు, తన కెమెరాలో మహిళల్ని చిత్రీకరించి ఆ విజువల్స్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంఘటన వెలుగు చూసింది. బాధిత మహిళ, ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ రస్ అల్ ఖమా మిస్డెమీనర్ కోర్టులో జరుగుతోంది. బాధిత మహిళల అనుమతి లేకుండా వారిని కెమెరాలో చిత్రీకరించినట్లు న్యాయస్థానానికి తెలిపారు పోలీసులు. అయితే తన మీద వచ్చిన ఆరోపణల్ని నిందితుడు అంగీకరించడంలేదు. ఆ ఇద్దరు మహిళలూ తనకు తెలుసనీ, వారి అనుమతితోనే వారిని వీడియో తీయడం జరిగిందని నిందితుడు అంటున్నాడు. సోషల్ మీడియాలో వీడియోను ఓ మహిళ భర్త చూడటం, ఆమెపై ఆ భర్త ఆగ్రహానికి గురవడంతో, ఆమె పోలీసులను ఆశ్రయించి, తనపై అక్రమంగా కేసు బనాయించినట్లు నిందితుడు విచారణలో పోలీసులకు తెలిపినట్లు సమాచారమ్.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







