మహిళల్ని కెమెరాలో చిత్రీకరించిన వ్యక్తిపై కేసు నమోదు
- December 07, 2017
గల్ఫ్ జాతీయుడైన యువకుడొకరు, తన కెమెరాలో మహిళల్ని చిత్రీకరించి ఆ విజువల్స్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంఘటన వెలుగు చూసింది. బాధిత మహిళ, ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ రస్ అల్ ఖమా మిస్డెమీనర్ కోర్టులో జరుగుతోంది. బాధిత మహిళల అనుమతి లేకుండా వారిని కెమెరాలో చిత్రీకరించినట్లు న్యాయస్థానానికి తెలిపారు పోలీసులు. అయితే తన మీద వచ్చిన ఆరోపణల్ని నిందితుడు అంగీకరించడంలేదు. ఆ ఇద్దరు మహిళలూ తనకు తెలుసనీ, వారి అనుమతితోనే వారిని వీడియో తీయడం జరిగిందని నిందితుడు అంటున్నాడు. సోషల్ మీడియాలో వీడియోను ఓ మహిళ భర్త చూడటం, ఆమెపై ఆ భర్త ఆగ్రహానికి గురవడంతో, ఆమె పోలీసులను ఆశ్రయించి, తనపై అక్రమంగా కేసు బనాయించినట్లు నిందితుడు విచారణలో పోలీసులకు తెలిపినట్లు సమాచారమ్.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి