కాల్చేశాడు...కోపమే కారణం
- December 09, 2017
రాయిపూర్: ఛత్తీస్గఢ్లో సీఆర్పీ ఎఫ్ జవాను జరిపిన కాల్పుల్లో అదే విభాగానికి చెందిన నలుగురు జవాన్లు మృతి చెందారు. ఈ సంఘటన శనివారం సాయంత్రం బస్తర్ ప్రాంతం బీజాపూర్లోని బసగూడ సీఆర్పీఎఫ్ 168 బెటాలియన్ క్యాంప్లో జరిగినట్టు ఆ ప్రాంత ఐజీ వివేకానందసిన్హా తెలిపారు. తన సీనియర్ సహచరులతో గొడవ పడి జవాను ఈ ఘటనకు పాల్పడినట్టు ఆయన తెలిపారు. ఆ ప్రాంత ఎస్పీతోపాటు సీనియర్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షి స్తున్నట్టు ఆయన చెప్పారు. మృతుల్లో ఇద్దరు సబ్- ఇన్స్పెక్టర్లు, ఓ అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్, ఓ కానిస్టేబుల్ ఉన్నారు. మరొకరికి గాయాలయ్యాయని తెలుస్తోంది.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







