చికాగో: హైదరాబాద్ యువకుడిపై కాల్పులు

- December 09, 2017 , by Maagulf
చికాగో: హైదరాబాద్ యువకుడిపై కాల్పులు

చికాగో: అమెరికాలో మహ్మద్ అక్బర్ అనే భారతీయ విద్యార్ధిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఉన్నత చదువుల కోసం అక్బర్ చికాగో వెళ్లాడు. చికాగోలోని అల్‌బరి పార్క్ వద్ద ఘటన జరిగింది. పార్క్ చేసిన కారువైపు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అక్బర్‌పై కాల్పులు జరిపారు. ఘటనలో అక్బర్‌కు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు అక్బర్ చికాగోలోని డెవ్రీ యూనివర్సిటీ విద్యార్ధి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com