'సీ ప్లేన్'కు ప్రయోగ పరీక్షలు
- December 09, 2017
దిల్లీ: నీటిపైనా దిగే, ఎగిరే విమానం 'సీ ప్లేన్'కు స్పైస్ జెట్ శనివారం ప్రయోగ పరీక్షలు నిర్వహించింది. ఇలాంటి వంద విమానాలను ఏడాదిలోగా అందుబాటులోకి తెచ్చేందుకు సంస్థ ప్రణాళికలు రచిస్తోంది. వీటి విలువ రూ.2,579 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజుల సమక్షంలో ముంబయిలోని గిర్గామ్ చౌపతి తీరంలో దీన్ని ప్రయోగాత్మకంగా నడిపింది. జపాన్ సంస్థ సిటౌచీతో కలిసి ఈ విమానాలను సంస్థ అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం జరిపినవి రెండో దశ పరీక్షలని సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. మౌలిక సదుపాయాలు అంతగా అందుబాటులోలేని చిన్నచిన్న నగరాలు, పట్టణాలకు వైమానిక సేవలు చేరువచేయడమే లక్ష్యంగా ఈ విమానాలను సంస్థ అభివృద్ధి చేస్తోంది. వీటిలో పది నుంచి 14 మంది వరకూ కూర్చొని ప్రయాణించే వీలుంది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







