'సీ ప్లేన్'కు ప్రయోగ పరీక్షలు
- December 09, 2017
దిల్లీ: నీటిపైనా దిగే, ఎగిరే విమానం 'సీ ప్లేన్'కు స్పైస్ జెట్ శనివారం ప్రయోగ పరీక్షలు నిర్వహించింది. ఇలాంటి వంద విమానాలను ఏడాదిలోగా అందుబాటులోకి తెచ్చేందుకు సంస్థ ప్రణాళికలు రచిస్తోంది. వీటి విలువ రూ.2,579 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజుల సమక్షంలో ముంబయిలోని గిర్గామ్ చౌపతి తీరంలో దీన్ని ప్రయోగాత్మకంగా నడిపింది. జపాన్ సంస్థ సిటౌచీతో కలిసి ఈ విమానాలను సంస్థ అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం జరిపినవి రెండో దశ పరీక్షలని సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. మౌలిక సదుపాయాలు అంతగా అందుబాటులోలేని చిన్నచిన్న నగరాలు, పట్టణాలకు వైమానిక సేవలు చేరువచేయడమే లక్ష్యంగా ఈ విమానాలను సంస్థ అభివృద్ధి చేస్తోంది. వీటిలో పది నుంచి 14 మంది వరకూ కూర్చొని ప్రయాణించే వీలుంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









