బాలీవుడ్ హీరోతో ప్రిన్స్ సరికొత్త ప్రయోగం
- December 10, 2017
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన క్రేజ్ రోజు రోజుకి పెంచుకుంటూ వెళుతున్నాడు. మొన్నటి వరకు టాలీవుడ్ వరకే పరిమితమైన మహేష్ ఇటీవల స్పైడర్ చిత్రంతో కోలీవుడ్కి ఎంటర్ అయ్యాడు. స్పైడర్లో మహేష్ అందం చూసి కోలీవుడ్ ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. ప్రస్తుతం మహేష్కి నేషనల్ వైడ్ క్రేజ్ ఉన్న నేపధ్యంలో పలు వాణిజ్య సంస్థలు ఆయనతో పలు యాడ్స్ చేస్తున్నాయి. గతంలో థమ్సప్ ప్రమోషన్ కోసం మహేష్ క్రేజ్ వాడుకున్న ఈ సంస్థ ఇప్పుడు మరోసారి ఆయనతో కలిసి నేషనల్ లెవల్లో ప్రమోషన్ చేస్తుంది. అయితే ఈ సారి బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ కూడా ఈ ప్రకటనలో నటించడం విశేషం. వీరిపై కాలిఫోర్నియాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పలు సన్నివేశాలు చిత్రీకరించినట్టు తెలుస్తుంది. మహేష్ ప్రస్తుతం భరత్ అనే నేను చిత్ర షూటింగ్తో బిజీగా ఉండగా, రణ్వీర్ నటించిన పద్మావతి చిత్రం విడుదలకి సిద్ధంగా ఉంది. తాజాగా రూపొందిన థమ్సప్ యాడ్లో మహేష్ కాస్త స్లిమ్గా ఉన్నట్టు కనిపిస్తుంది.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







