బాలీవుడ్ హీరోతో ప్రిన్స్ సరికొత్త ప్రయోగం
- December 10, 2017
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన క్రేజ్ రోజు రోజుకి పెంచుకుంటూ వెళుతున్నాడు. మొన్నటి వరకు టాలీవుడ్ వరకే పరిమితమైన మహేష్ ఇటీవల స్పైడర్ చిత్రంతో కోలీవుడ్కి ఎంటర్ అయ్యాడు. స్పైడర్లో మహేష్ అందం చూసి కోలీవుడ్ ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. ప్రస్తుతం మహేష్కి నేషనల్ వైడ్ క్రేజ్ ఉన్న నేపధ్యంలో పలు వాణిజ్య సంస్థలు ఆయనతో పలు యాడ్స్ చేస్తున్నాయి. గతంలో థమ్సప్ ప్రమోషన్ కోసం మహేష్ క్రేజ్ వాడుకున్న ఈ సంస్థ ఇప్పుడు మరోసారి ఆయనతో కలిసి నేషనల్ లెవల్లో ప్రమోషన్ చేస్తుంది. అయితే ఈ సారి బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ కూడా ఈ ప్రకటనలో నటించడం విశేషం. వీరిపై కాలిఫోర్నియాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పలు సన్నివేశాలు చిత్రీకరించినట్టు తెలుస్తుంది. మహేష్ ప్రస్తుతం భరత్ అనే నేను చిత్ర షూటింగ్తో బిజీగా ఉండగా, రణ్వీర్ నటించిన పద్మావతి చిత్రం విడుదలకి సిద్ధంగా ఉంది. తాజాగా రూపొందిన థమ్సప్ యాడ్లో మహేష్ కాస్త స్లిమ్గా ఉన్నట్టు కనిపిస్తుంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







