బాలీవుడ్ హీరోతో ప్రిన్స్ సరికొత్త ప్రయోగం
- December 10, 2017
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన క్రేజ్ రోజు రోజుకి పెంచుకుంటూ వెళుతున్నాడు. మొన్నటి వరకు టాలీవుడ్ వరకే పరిమితమైన మహేష్ ఇటీవల స్పైడర్ చిత్రంతో కోలీవుడ్కి ఎంటర్ అయ్యాడు. స్పైడర్లో మహేష్ అందం చూసి కోలీవుడ్ ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. ప్రస్తుతం మహేష్కి నేషనల్ వైడ్ క్రేజ్ ఉన్న నేపధ్యంలో పలు వాణిజ్య సంస్థలు ఆయనతో పలు యాడ్స్ చేస్తున్నాయి. గతంలో థమ్సప్ ప్రమోషన్ కోసం మహేష్ క్రేజ్ వాడుకున్న ఈ సంస్థ ఇప్పుడు మరోసారి ఆయనతో కలిసి నేషనల్ లెవల్లో ప్రమోషన్ చేస్తుంది. అయితే ఈ సారి బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ కూడా ఈ ప్రకటనలో నటించడం విశేషం. వీరిపై కాలిఫోర్నియాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పలు సన్నివేశాలు చిత్రీకరించినట్టు తెలుస్తుంది. మహేష్ ప్రస్తుతం భరత్ అనే నేను చిత్ర షూటింగ్తో బిజీగా ఉండగా, రణ్వీర్ నటించిన పద్మావతి చిత్రం విడుదలకి సిద్ధంగా ఉంది. తాజాగా రూపొందిన థమ్సప్ యాడ్లో మహేష్ కాస్త స్లిమ్గా ఉన్నట్టు కనిపిస్తుంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









