మోడీకి కృతజ్ఞలు తెలిపేందుకు వెళ్లిన భార్య.. తలాక్ చెప్పిన భర్త!
- December 10, 2017
లక్నో: బీజేపీ ర్యాలీలో పాల్గొందనే కారణంతో ఓ భర్త తన భార్యకు తలాక్ చెప్పిన ఉదంతమిది. ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ఈ ఘటన సంచలనం సృష్టించింది. పైగా అతడు ఆమెను ప్రేమించి మరీ పెళ్లిచేసుకున్నాడు.
వివరాల్లోకి వెళితే... బరేలీ పట్టణానికి చెందిన దానిష్, ఫరా ప్రేమించుకుని గత ఏడాది ఏప్రిల్లో పెళ్లిచేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ట్రిపుల్ తలాక్ను రద్దు చేస్తూ కేంద్రమంతి ముక్తార్ అబ్బాస్ నక్వీ సోదరి, సామాజిక కార్యకర్త అయిన ఫర్హాత్ నక్వీ శుక్రవారం నిర్వహించిన ధన్యవాద్ ర్యాలీకి ఫరా హాజరుకావడం ఆమె కొంప ముంచింది.
ట్రిపుల్ తలాక్ను రద్దు చేసిన మోడీకి కృతజ్ఞతలు తెలిపేందుకు తాను ఆ ర్యాలీకి హాజరయ్యానని, కానీ ర్యాలీ నుంచి ఇంటికి రాగానే తన భర్త దానిష్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తలాక్ చెప్పి తనను బయటకు గెంటేశాడని ఫరా వాపోయింది.
అయితే ఈ విషయంలో ఆమె భర్త దానిష్ వాదన మరోలా ఉంది. ఫరా జీన్స్ ధరిస్తోందని, వివాహేతర సంబంధాలు కూడా పెట్టుకున్నట్టు అనుమానం రావడంతోనే ఆమెకు తలాక్ చెప్పానని అతడు అంటున్నాడు.
మరోవైపు ట్రిపుల్ తలాక్ విషయమై బాధితురాలు ఫరా పోలీసులను ఆశ్రయించగా వారు కేసు నమోదు చేయలేదు. దీంతో ఈ విషయాన్ని కేంద్ర మంత్రి సోదరి ఫర్హాత్ నక్వీ దృష్టికి తీసుకెళ్లారామె. ఈ ఘటనపై వెంటనే స్పందించిన ఆమె ఈ విషయాన్ని పై స్థాయికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







