డిసెంబర్ 14న గ్రహాంతరవాసుల గురించి ప్రకటించనున్న నాసా
- December 11, 2017
ప్రపంచం మొత్తం ఇప్పుడు డిసెంబర్ 14న నాసా చేయబోయే ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. గ్రహాంతర వాసులు ఉన్నాయా?.. వాటి మనుగడ ఎలా కొనసాగుతోంది? వాటి వల్ల మానవాళికి నిజంగా ముప్పు ఉందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఆరోజే దొరకబోతోంది.
అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా గత కొన్నేళ్లుగా ఈ విషయపై తీవ్రంగా పరిశోధనలు చేస్తున్న విషయం తెలిసిందే. కెప్లర్ స్పేస్ టెలిస్కోప్ సాయంతో 2009 నుంచి పరిశోధనలు జరుపుతున్న శాస్త్రవేత్తలకి 2500కి పైగా ఏలియన్ల జాడలు కనిపించినట్లు సమాచారం. ఈ మేరకు అందులో నిక్షిప్తమైన సమాచారాన్ని గురువారం నిర్వహించబోయే సమావేశంలో వెల్లడించనున్నారు.
గోల్డీలాక్ జోన్లో ఇవి పరిభ్రమించే ప్రాంతాలను గుర్తించారు. జీవజాలం అభివృద్ధి చెందడానికి ఆ ప్రాంతాల పరిస్థితులు అనుకూలిస్తాయని శాస్త్రవేత్తలు గతంలోనే వెల్లడించారు. గూగుల్ సంస్థ అందించిన మెషీన్ లెర్నింగ్ విధానం ద్వారా కెప్లర్ టెలిస్కోప్ గుర్తించిన గ్రహాలను నాసా అధ్యయనం చేసింది. వాషింగ్టన్లోని నాసా హెడ్ క్వార్టర్స్ డైరెక్టర్ పౌల్ హెర్ట్జ్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!