14న టీఆర్ఎస్లో చేరనున్న మాజీ మంత్రి ఉమా
- December 12, 2017
మాజీ మంత్రి, తెలంగాణ తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్న ఉమా మాధవరెడ్డి, ఆమె కుమారుడు సందీప్రెడ్డి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరికకు రంగం సిద్ధమైంది. వారు ఈనెల 14వతేదీన టీఆర్ఎస్లో చేరుతున్నారు. ఈమేరకు మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రగతి భవన్ లో కలిశారు. కాగా... తెలుగుదేశం పార్టీలో పొలిట్బ్యూరో సభ్యురాలిగా ఉన్న ఉమా మాధవరెడ్డి... టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారనే ఊహగానాలు వచ్చాయి. ప్రస్తుతం ఈ ఊహాగానాలను నిజం చేస్తూ 14వతేదీన తమ అనుచరులతో కలిసి టీఆర్ఎస్లో చేరుతున్నారు. టీ టీడీపీ ఉపాధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి టీడీపీ నుంచి అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్ పార్టీల్లోకి వలసలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!