14న టీఆర్ఎస్లో చేరనున్న మాజీ మంత్రి ఉమా
- December 12, 2017
మాజీ మంత్రి, తెలంగాణ తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్న ఉమా మాధవరెడ్డి, ఆమె కుమారుడు సందీప్రెడ్డి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరికకు రంగం సిద్ధమైంది. వారు ఈనెల 14వతేదీన టీఆర్ఎస్లో చేరుతున్నారు. ఈమేరకు మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రగతి భవన్ లో కలిశారు. కాగా... తెలుగుదేశం పార్టీలో పొలిట్బ్యూరో సభ్యురాలిగా ఉన్న ఉమా మాధవరెడ్డి... టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారనే ఊహగానాలు వచ్చాయి. ప్రస్తుతం ఈ ఊహాగానాలను నిజం చేస్తూ 14వతేదీన తమ అనుచరులతో కలిసి టీఆర్ఎస్లో చేరుతున్నారు. టీ టీడీపీ ఉపాధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి టీడీపీ నుంచి అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్ పార్టీల్లోకి వలసలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







