వరుసగా రెండోరోజు భూకంపం... వణుకుతున్న ఇరాన్
- December 12, 2017
టెహ్రాన్(ఇరాన్): ఇటీవల వరుస భూకంపాలతో ఇరాన్ ప్రజలు వణికిపోతున్నారు. నిన్న కెర్మాన్ ప్రావిన్స్లో చోటుచేసుకున్న భూకంపం మర్చిపోకముందే... మళ్లీ ఈరోజు ఉదయం ఉత్తర, మధ్య ఇరాన్ను భూప్రకంపనలు కుదిపేశాయి. రిక్టర్ స్కేలు వద్ద ఇవాళ చోటుచేసుకున్న భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. భూకంపం కారణంగా జరిగిన ప్రాణనష్టం, ఆస్తినష్టంపై ఇంకా సమాచారం లేదు. అత్యంత సమస్యాత్మక రేఖలపై ఉండడంతో భూకంప బాధిత దేశంగా మారిన ఇరాన్.. ఇటీవల అపార నష్టం చవిచూస్తోంది. నిన్న కెర్మాన్ ప్రాంతంలో 6.2 తీవ్రతతో భూకంపం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. సరిగ్గా నెలరోజుల క్రితం 7.3 తీవ్రతతో సంభవించిన భూకంపం ఇరాన్ పశ్చిమ ప్రావిన్స్ కెర్మాన్షాను అతలాకుతలం చేసింది. ఈ భూవిలయంతో 530కి పైగా ప్రాణాలు కోల్పోగా... దాదాపు 8వేల మంది గాయపడ్డారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







