విమానం హైజాక్ చేస్తారంటూ ఫోన్కాల్.. శంషాబాద్ విమానాశ్రయంలో భారీ భద్రత
- December 12, 2017
శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. బీహార్ నుంచి సానియా భాహర్ అనే మహిళ శంషాబాద్ పోలీసులకు ఫోన్ చేసి విమానం హైజాక్ విషయంపై మాట్లాడింది. ఈ నెల 24న లక్నోకు చెందిన షోయబ్ అనే యువకుడు శంషాబాద్ నుంచి జెడ్డాకు వెళ్తున్నాడని, అతనికి ఐఎస్ఐతో సంబంధముందని చెప్పింది. పేలుడు పదార్థాలతో విమానం ఎక్కి హైజాక్ చేసే ప్లాన్ చేస్తున్నాడని అతన్ని ఎలాగైనా పట్టుకోవాలని పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో ముంబై పోలీసులు సానియా భాహర్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇటు షోయబ్ అనే వ్యక్తిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







