టీడీపీకి గుడ్ బై చెప్పనున్న యలమంచిలి రవి
- December 14, 2017
కృష్ణా జిల్లాలో టీడీపీకి గట్టి షాక్ తగలబోతోంది. జిల్లాలో లక్షలాది మంది క్యాడర్ కలిగిన బలమైన నాయకుడు, మాజీ MLA యలమంచిలి రవి, తెలుగుదేశానికి గుడ్బై చెప్పి వైసీపీలో చేరబోతున్నారు. జగన్ పాదయాత్ర విజయవాడ వచ్చినప్పుడు రవి వైసీపీలో చేరతారని అనుచరులు చెప్తున్నారు. TDP నేతలు బుజ్జగించేందుకు ప్రయత్నించినా ఆయన వైసీపీలో చేరాలనే నిర్ణయానికి వచ్చారు.
కృష్ణా జిల్లా రాజకీయాల్లో యలమంచిలి కుటుంబానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. జిల్లాలో బలమైన క్యాడర్ ఉన్న నాయకుల్లో రవి ఒకరు. గతంలో రవి తండ్రి యలమంచిలి నాగేశ్వర్రావు కూడా MLAగా పనిచేశారు. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు కంకిపాడు నుంచి దేవినేని నెహ్రూపై నాగేశ్వర్రావు MLAగా గెలిచారు. 2009లో ఆయన తనయుడు రవి PRP నుంచి పోటీ చేసి విజయవాడ తూర్పు MLAగా విజయం సాధించారు. రవి కూడా నెహ్రూపైనే గెలవడం విశేషం. జిల్లాలో బలమైన క్యాడర్ ఉన్న రవి ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలతో ఆయన పార్టీ మారాలని నిర్ణయానికి వచ్చారు. త్వరలోనే జగన్ సమక్షంలో ఆయన YCP తీర్థం పుచ్చుకుంటారని సన్నిహితులు చెప్తున్నారు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









