టీడీపీకి గుడ్ బై చెప్పనున్న యలమంచిలి రవి
- December 14, 2017కృష్ణా జిల్లాలో టీడీపీకి గట్టి షాక్ తగలబోతోంది. జిల్లాలో లక్షలాది మంది క్యాడర్ కలిగిన బలమైన నాయకుడు, మాజీ MLA యలమంచిలి రవి, తెలుగుదేశానికి గుడ్బై చెప్పి వైసీపీలో చేరబోతున్నారు. జగన్ పాదయాత్ర విజయవాడ వచ్చినప్పుడు రవి వైసీపీలో చేరతారని అనుచరులు చెప్తున్నారు. TDP నేతలు బుజ్జగించేందుకు ప్రయత్నించినా ఆయన వైసీపీలో చేరాలనే నిర్ణయానికి వచ్చారు.
కృష్ణా జిల్లా రాజకీయాల్లో యలమంచిలి కుటుంబానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. జిల్లాలో బలమైన క్యాడర్ ఉన్న నాయకుల్లో రవి ఒకరు. గతంలో రవి తండ్రి యలమంచిలి నాగేశ్వర్రావు కూడా MLAగా పనిచేశారు. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు కంకిపాడు నుంచి దేవినేని నెహ్రూపై నాగేశ్వర్రావు MLAగా గెలిచారు. 2009లో ఆయన తనయుడు రవి PRP నుంచి పోటీ చేసి విజయవాడ తూర్పు MLAగా విజయం సాధించారు. రవి కూడా నెహ్రూపైనే గెలవడం విశేషం. జిల్లాలో బలమైన క్యాడర్ ఉన్న రవి ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలతో ఆయన పార్టీ మారాలని నిర్ణయానికి వచ్చారు. త్వరలోనే జగన్ సమక్షంలో ఆయన YCP తీర్థం పుచ్చుకుంటారని సన్నిహితులు చెప్తున్నారు.
తాజా వార్తలు
- ఎన్నికల ప్రచారానికి నేటితో తెర
- ఏపీకి క్యూకట్టిన ఆంధ్ర ఓటర్లు పంతంగి టోల్ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
- యాత్రికులు ఉమ్రా స్లాట్లను ఎలా బుక్ చేసుకోవాలంటే?
- ఒమన్ లో మీడియా ముసాయిదా చట్టం పై చర్చ
- యూఏఈ-ఒమన్ రైల్వే: $3-బిలియన్ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభం
- బహ్రెయిన్లో 747,350కి చేరిన వాహనాలు
- ఏప్రిల్లో QR7.56bn లావాదేవీలు
- 350 దిర్హామ్ల ఎయిర్ టాక్సీ రైడ్లు
- భారత్కు మరో దౌత్య విజయం
- ‘జగన్ 2.0 ప్రచారం జోష్..’: వాడ వాడల్లో స్టార్ క్యాంపెయినర్లు