టీడీపీకి గుడ్ బై చెప్పనున్న యలమంచిలి రవి
- December 14, 2017
కృష్ణా జిల్లాలో టీడీపీకి గట్టి షాక్ తగలబోతోంది. జిల్లాలో లక్షలాది మంది క్యాడర్ కలిగిన బలమైన నాయకుడు, మాజీ MLA యలమంచిలి రవి, తెలుగుదేశానికి గుడ్బై చెప్పి వైసీపీలో చేరబోతున్నారు. జగన్ పాదయాత్ర విజయవాడ వచ్చినప్పుడు రవి వైసీపీలో చేరతారని అనుచరులు చెప్తున్నారు. TDP నేతలు బుజ్జగించేందుకు ప్రయత్నించినా ఆయన వైసీపీలో చేరాలనే నిర్ణయానికి వచ్చారు.
కృష్ణా జిల్లా రాజకీయాల్లో యలమంచిలి కుటుంబానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. జిల్లాలో బలమైన క్యాడర్ ఉన్న నాయకుల్లో రవి ఒకరు. గతంలో రవి తండ్రి యలమంచిలి నాగేశ్వర్రావు కూడా MLAగా పనిచేశారు. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు కంకిపాడు నుంచి దేవినేని నెహ్రూపై నాగేశ్వర్రావు MLAగా గెలిచారు. 2009లో ఆయన తనయుడు రవి PRP నుంచి పోటీ చేసి విజయవాడ తూర్పు MLAగా విజయం సాధించారు. రవి కూడా నెహ్రూపైనే గెలవడం విశేషం. జిల్లాలో బలమైన క్యాడర్ ఉన్న రవి ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలతో ఆయన పార్టీ మారాలని నిర్ణయానికి వచ్చారు. త్వరలోనే జగన్ సమక్షంలో ఆయన YCP తీర్థం పుచ్చుకుంటారని సన్నిహితులు చెప్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







