అమర్నాథ్ గుహలో ఇకపై మంత్రం వినిపించదు
- December 14, 2017
హిందువుల ఆలయాలు మంత్రోచ్ఛారణకు నిలయాలు. ఆలయంలోకి ప్రవేశించగానే పండితుల వేద మంత్రాలు చెవులకు వీనుల విందుగావిస్తాయి. హారతి కర్పూరపు వాసనలు, ద్వారంలోని గంటలు భక్తులను దేవుని దగ్గరకు చేరుస్తుంది. అయితే ఇకపై హిందువులు అతి పవిత్రంగా భావిచే ఆదిశంకరుడు కొలువైన అమరనాథ్ ఆలయంలో మాత్రం మంత్రాలు, గంటల జైజై ధ్వానాలు వినిపించకూడదని ఆలయ అధికారులని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బోర్డ్ (ఎన్జీటీ) ఆదేశించింది. వీటితో పాటు మరికొన్ని ఆంక్షలు కూడా పెట్టింది. భక్తులు క్యూలైన్ పాటించాలని, దేవుని సన్నిధానానికి వచ్చేటప్పుడు మొబైల్స్ తదితర వస్తువులను తీసుకువెళ్లరాదని, భక్తులు తమ వస్తువులు భద్రపరుచుకునేందుకు స్టోర్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆలయ అధికారులను ఎన్జీటీ ఆదేశించింది. ఆలయ మార్గంలో షాపులకు అనుమతివ్వరాదని పేర్కొంది. వివిధ ప్రాంతాలనుంచి ఎంతో వ్యయప్రయాసలకోర్చి భక్తులు అమర్నాథ్ను సందర్శిస్తారు. వారికి సరైన సదుపాయాలను కల్పించాల్సిన బాధ్యతని విస్మరించరాదని అధికారులను మందలించింది. ఆలయ పవిత్రతను కాపాడాలంటూ ఎన్జీటీ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!







