రామోజీ రావు వేసిన 'థియేటర్' ప్లాన్
- December 16, 2017
పత్రికా రంగంలో రారాజు ఈనాడు. అధినేత రామోజీ రావుని మీడియా మొఘల్ అంటారంటే, ప్రింట్ మీడియాలో ఈనాడు పెత్తనం, రామోజీ తెలివితేటలు ఏ స్థాయిలో ఉంటున్నాయో అర్థం చేసుకోవొచ్చు. రామోజీ ఏ పని మొదలెట్టినా అది గ్రాండ్ సక్సెసే. ఫిల్మ్ సిటీ సూపర్ హిట్. ప్రియా పచ్చడి హిట్. మార్గదర్శి బంపర్ హిట్. ఉషాకిరణ్ మూవీస్ హిట్టు మీద హిట్టు. ఇంగ్లీష్ డైలీ విషయంలోనే రామోజీ తప్పటడుగు వేశాడు. ఆ తరవాత ఏ వ్యాపారం మొదలెట్టినా మరింత ఆచి తూచి వ్యవహరించడం మొదలెట్టారు. ఇప్పుడు రామోజీ మరో కొత్త బిజినెస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని టాక్. ఈసారి హోమ్ థియేటర్ పై రామోజీ దృష్టిసారించార్ట. హోం థియేటర్ అంటే మన టీవీకి పెట్టుకునే సౌండ్ సిస్టమ్ తరహా కాదు. సెలబ్రెటీల ఇళ్లలో ఓ మినీ థియేటరే ఉంటుంది కదా.. ఆ తరహా అన్నమాట. విదేశాల్లో హోం థియేటర్స్కి బాగా అలవాటు పడుతున్నారు జనం. ఇక్కడ కూడా ఆ సంస్ర్కృతి పెరుగుతోంది.
ఒక్కో థియేటర్ రూపకల్పనకూ రూ.10 నుంచి 25 లక్షల వరకూ అవుతుందని తెలుస్తోంది. అధునాతన సౌండ్ టెక్నాలజీ, శాటిలైట్ తో అనుసంధానం.. లాంటి విషయాల్లో మేటిగా అనిపించుకున్న ఓ కంపెనీతో రామోజీ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని, త్వరలోనే ఇందుకు సంబంధించిన విషయాలు బయటకు రాబోతున్నాయని తెలుస్తోంది. మరి ఈ కొత్త వ్యాపారంలో రామోజీ ఎన్ని అద్భుతాలు సృస్టిస్తారో చూడాలి.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









