రామోజీ రావు వేసిన 'థియేటర్' ప్లాన్
- December 16, 2017
పత్రికా రంగంలో రారాజు ఈనాడు. అధినేత రామోజీ రావుని మీడియా మొఘల్ అంటారంటే, ప్రింట్ మీడియాలో ఈనాడు పెత్తనం, రామోజీ తెలివితేటలు ఏ స్థాయిలో ఉంటున్నాయో అర్థం చేసుకోవొచ్చు. రామోజీ ఏ పని మొదలెట్టినా అది గ్రాండ్ సక్సెసే. ఫిల్మ్ సిటీ సూపర్ హిట్. ప్రియా పచ్చడి హిట్. మార్గదర్శి బంపర్ హిట్. ఉషాకిరణ్ మూవీస్ హిట్టు మీద హిట్టు. ఇంగ్లీష్ డైలీ విషయంలోనే రామోజీ తప్పటడుగు వేశాడు. ఆ తరవాత ఏ వ్యాపారం మొదలెట్టినా మరింత ఆచి తూచి వ్యవహరించడం మొదలెట్టారు. ఇప్పుడు రామోజీ మరో కొత్త బిజినెస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని టాక్. ఈసారి హోమ్ థియేటర్ పై రామోజీ దృష్టిసారించార్ట. హోం థియేటర్ అంటే మన టీవీకి పెట్టుకునే సౌండ్ సిస్టమ్ తరహా కాదు. సెలబ్రెటీల ఇళ్లలో ఓ మినీ థియేటరే ఉంటుంది కదా.. ఆ తరహా అన్నమాట. విదేశాల్లో హోం థియేటర్స్కి బాగా అలవాటు పడుతున్నారు జనం. ఇక్కడ కూడా ఆ సంస్ర్కృతి పెరుగుతోంది.
ఒక్కో థియేటర్ రూపకల్పనకూ రూ.10 నుంచి 25 లక్షల వరకూ అవుతుందని తెలుస్తోంది. అధునాతన సౌండ్ టెక్నాలజీ, శాటిలైట్ తో అనుసంధానం.. లాంటి విషయాల్లో మేటిగా అనిపించుకున్న ఓ కంపెనీతో రామోజీ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని, త్వరలోనే ఇందుకు సంబంధించిన విషయాలు బయటకు రాబోతున్నాయని తెలుస్తోంది. మరి ఈ కొత్త వ్యాపారంలో రామోజీ ఎన్ని అద్భుతాలు సృస్టిస్తారో చూడాలి.
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







