భారీగా పెరిగిన తిరుపతి లడ్డు ధరలు
- December 16, 2017
శ్రీవారి మహా ప్రసాదమైన లడ్డూని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. వెంకన్న దర్శనం చేసుకుని లడ్డూ ప్రసాదాన్ని తీసుకునే తిరిగి వెళ్తారు.. భక్తుల కోసం నిత్యం మూడు లక్షలకుపైగా లడ్డూలను టీటీడీ తయారు చేస్తోంది. ప్రస్తుతం మార్కెట్ ధరల ప్రకారం ఒక్కో లడ్డూ తయారీకి 30 రూపాయల వరకు ఖర్చవుతోంది.. అయితే దర్శనానికి వచ్చే భక్తులకు ఉచితంగానే అందజేస్తున్న అధికారులు.. అదనపు లడ్డూలకు మాత్రం 25 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇకపై వీటి రేట్లను పెంచాలనే నిర్ణయానికొచ్చింది టీటీడీ. ఇప్పటికే ధార్మిక కార్యక్రమాలకు సరఫరా చేసే ప్రసాదం ధరలను పెంచగా.. సిఫార్సు లడ్డూల రేట్లను కూడా ఈనెల 25 నుంచి పెంచనుంది.100 రూపాయలున్న కల్యాణోత్సవ లడ్డూ ధరని రెట్టింపు చేశారు. సాధారణ లడ్డూని 50 రూపాయలు చేశారు. వడ ప్రసాదాన్ని కూడా 100 రూపాయలుగా నిర్ణయించారు. పెరిగిన ధరలు ఈనెల 25 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే ఈ పెంపు ఇక్కడి వరకు ఆగిపోదనే అనుమానం కలుగుతోంది. చివరి దశలో సామాన్య భక్తులకు కేటాయించే లడ్డూ ధరలను కూడా పెంచవచ్చనే ప్రచారం జరుగుతోంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల