భారీగా పెరిగిన తిరుపతి లడ్డు ధరలు
- December 16, 2017
శ్రీవారి మహా ప్రసాదమైన లడ్డూని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. వెంకన్న దర్శనం చేసుకుని లడ్డూ ప్రసాదాన్ని తీసుకునే తిరిగి వెళ్తారు.. భక్తుల కోసం నిత్యం మూడు లక్షలకుపైగా లడ్డూలను టీటీడీ తయారు చేస్తోంది. ప్రస్తుతం మార్కెట్ ధరల ప్రకారం ఒక్కో లడ్డూ తయారీకి 30 రూపాయల వరకు ఖర్చవుతోంది.. అయితే దర్శనానికి వచ్చే భక్తులకు ఉచితంగానే అందజేస్తున్న అధికారులు.. అదనపు లడ్డూలకు మాత్రం 25 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇకపై వీటి రేట్లను పెంచాలనే నిర్ణయానికొచ్చింది టీటీడీ. ఇప్పటికే ధార్మిక కార్యక్రమాలకు సరఫరా చేసే ప్రసాదం ధరలను పెంచగా.. సిఫార్సు లడ్డూల రేట్లను కూడా ఈనెల 25 నుంచి పెంచనుంది.100 రూపాయలున్న కల్యాణోత్సవ లడ్డూ ధరని రెట్టింపు చేశారు. సాధారణ లడ్డూని 50 రూపాయలు చేశారు. వడ ప్రసాదాన్ని కూడా 100 రూపాయలుగా నిర్ణయించారు. పెరిగిన ధరలు ఈనెల 25 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే ఈ పెంపు ఇక్కడి వరకు ఆగిపోదనే అనుమానం కలుగుతోంది. చివరి దశలో సామాన్య భక్తులకు కేటాయించే లడ్డూ ధరలను కూడా పెంచవచ్చనే ప్రచారం జరుగుతోంది.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







