మంత్రి కేటీఆర్‌కు "లీడర్ ఆఫ్ ది ఇయర్" అవార్డు

- December 17, 2017 , by Maagulf
మంత్రి కేటీఆర్‌కు

హైదరాబాద్: రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రముఖ మీడియా సంస్థ బిజినెస్ వరల్డ్ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయనను బిజినెస్ వరల్డ్ "లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు" వరించింది. ఉత్తమ పట్టణ మౌలిక వసతులున్న రాష్ట్రంగా తెలంగాణకు మరో అవార్డు దక్కింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ, పట్టణాల్లో హరితహారం, డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణం వంటి అంశాలను ఈ సంస్థ పరిగణనలోకి తీసుకొని ఈ అవార్డులకు ఎంపిక చేసింది. ఈ నెల 20న ఢిల్లీలో ఈ అవార్డులను సంస్థ ప్రదానం చేయనున్నది. ఈ సందర్భంగా ఐదో జాతీయ స్మార్ట్ సిటీ కాన్ఫరెన్స్‌కు మంత్రి కేటీఆర్‌ను బిజినెస్ వరల్డ్ సంస్థ ఆహ్వానించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com