రైల్వేస్టేషన్పై దాడి, అధికారుల కిడ్నాప్.!
- December 19, 2017
బిహార్లో నక్సలైట్లు రెచ్చిపోయారు. అర్ధరాత్రి ఓ రైల్వేస్టేషన్పై దాడి చేసి.. అక్కడి అధికారులను కిడ్నాప్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో జమల్పూర్ జిల్లాలోని మసుదాన్ రైల్వేస్టేషన్పై కొందరు నక్సలైట్లు దాడి చేశారు. అక్కడి కమ్యూనికేషన్ గదికి నిప్పంటించారు. అనంతరం అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, మరో అధికారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. సమాచారమందుకున్న రైల్వే పోలీసులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కాగా.. కిడ్నాప్కు గురైన అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ నుంచి మాల్దా డీఆర్ఎంకు ఫోన్ వచ్చినట్లు స్థానిక మీడియా వర్గాల సమాచారం. మసుదాన్ ట్రాక్పై రైలు రాకపోకలు చేపడితే తమను చంపేస్తామని నక్సలైట్లు బెదిరించినట్లు అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు ఆ మార్గాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ప్రయాణికులకు సూచించారు. ఈ ఫోన్కాల్పై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







