రైల్వేస్టేషన్పై దాడి, అధికారుల కిడ్నాప్.!
- December 19, 2017
బిహార్లో నక్సలైట్లు రెచ్చిపోయారు. అర్ధరాత్రి ఓ రైల్వేస్టేషన్పై దాడి చేసి.. అక్కడి అధికారులను కిడ్నాప్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో జమల్పూర్ జిల్లాలోని మసుదాన్ రైల్వేస్టేషన్పై కొందరు నక్సలైట్లు దాడి చేశారు. అక్కడి కమ్యూనికేషన్ గదికి నిప్పంటించారు. అనంతరం అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, మరో అధికారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. సమాచారమందుకున్న రైల్వే పోలీసులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కాగా.. కిడ్నాప్కు గురైన అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ నుంచి మాల్దా డీఆర్ఎంకు ఫోన్ వచ్చినట్లు స్థానిక మీడియా వర్గాల సమాచారం. మసుదాన్ ట్రాక్పై రైలు రాకపోకలు చేపడితే తమను చంపేస్తామని నక్సలైట్లు బెదిరించినట్లు అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు ఆ మార్గాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ప్రయాణికులకు సూచించారు. ఈ ఫోన్కాల్పై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- ఆగస్టు 1 నుంచి మారనున్న స్పీడ్ పోస్ట్ ఛార్జీలు..పూర్తి వివరాలు ఇవే!
- తైవాన్ పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం
- బహ్రెయిన్లో డొమెస్టిక్ వర్కర్ కు 5 ఏళ్ల జైలు, భారీ జరిమానా..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో స్పెయిన్ ప్రధాని చర్చలు..!!
- ఖతార్లో పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యానికి ప్రత్యేక క్లినిక్..!!
- ధోఫార్లోని వాడి జర్జీజ్లో వ్యక్తిని రక్షించిన సివిల్ డిఫెన్స్..!!
- కువైట్లో కొత్త ఫ్రీలాన్స్ వ్యాపార లైసెన్సుల జారీ నిలిపివేత..!!
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టులపై నిపుణుల వార్నింగ్..!!
- NEET పేపర్ లీక్ కేసులో 13 మందిపై సీబీఐ అభియోగాలు
- తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు







