రైల్వేస్టేషన్పై దాడి, అధికారుల కిడ్నాప్.!
- December 19, 2017
బిహార్లో నక్సలైట్లు రెచ్చిపోయారు. అర్ధరాత్రి ఓ రైల్వేస్టేషన్పై దాడి చేసి.. అక్కడి అధికారులను కిడ్నాప్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో జమల్పూర్ జిల్లాలోని మసుదాన్ రైల్వేస్టేషన్పై కొందరు నక్సలైట్లు దాడి చేశారు. అక్కడి కమ్యూనికేషన్ గదికి నిప్పంటించారు. అనంతరం అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, మరో అధికారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. సమాచారమందుకున్న రైల్వే పోలీసులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కాగా.. కిడ్నాప్కు గురైన అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ నుంచి మాల్దా డీఆర్ఎంకు ఫోన్ వచ్చినట్లు స్థానిక మీడియా వర్గాల సమాచారం. మసుదాన్ ట్రాక్పై రైలు రాకపోకలు చేపడితే తమను చంపేస్తామని నక్సలైట్లు బెదిరించినట్లు అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు ఆ మార్గాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ప్రయాణికులకు సూచించారు. ఈ ఫోన్కాల్పై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- తైవాన్లోని అత్యంత ఎత్తైన భవనాన్ని అధిరోహించిన అమెరికన్ సాహసవీరుడు..!!
- సౌదీ పోర్టుల్లో 965 ప్రొహిబిటేడ్ ఐటమ్స్ సీజ్..!!
- దుబాయ్లో ఆస్తి కొనుగోలు చేస్తున్నారా?
- కువైట్ లోని లులు హైపర్ మార్కెట్లో ఇండియా ఉత్సవ్ వేడుకలు..!!
- 2050 నాటికి 83.6 మిలియన్లకు జీసీసీ జనాభా..!!
- బహ్రెయిన్ లో చైల్డ్ కేర్ కోసం కఠిన నిబంధనలు..!!
- నీట్ పీజీ పరీక్ష తేదీ రిలీజ్
- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
- H-1B వీసాదారులకు షాక్..2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!
- ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు







