కాకినాడ తీరాన్ని హోరెత్తించిన ఏఆర్ మ్యూజికల్ నైట్..
- December 22, 2017
కాకినాడ తీరం సంగీత ఝరిలో ఓలలలాడింది. చివరి రోజు బీచ్ ఫెస్టివల్లో ఏ ఆర్ రెహమాన్ మ్యూజికల్ షో అదుర్స్ అనిపించింది. రెహమాన్ పాటలకు యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక అదిరిపోయే స్టెప్పులతో డ్యాన్సర్లు చేసిన ఫెర్ఫ్మామెన్స్ ఇరగదీశారు. చివరి రోజు కార్యక్రమానికి మంత్రులు చినరాజప్ప, యనమల, అయ్యన్నపాత్రడుతో పాటు జిల్లా రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. షో తర్వాత రెహమాన్ను ఏపీ ప్రభుత్వం తరఫున ఘనంగా సత్కరించారు. తెలుగింటి సంస్కృతి, సంప్రదాయాలకు బీచ్ ఫెస్టివల్ అద్దం పట్టింది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మత్స్యశాఖ అధికారులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో వివిధ రకాల చేపల ఎక్వేరియం మరో ఆకర్షణగా నిలిచింది. అలాగే పర్యాటకులను ఆకట్టుకునేందుకు పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన హెలికాప్టర్, పారా చ్యూట్ , స్పీడ్ బోట్ రైడింగ్ కు చిన్నా పెద్దా అంతా ఆసక్తి చూపారు. ఆకాశంలో విహరిస్తూ.. కాకినాడ అందాలను ఎంజాయ్ చేశారు. అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫల, పూల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







