కొత్త వ్యవస్థలో సౌదీ జనాభాలో సగం మందికి సంక్షేమ ఫలాలు
- December 22, 2017
దుబాయ్ : సౌదీ అరేబియా గురువారం 2 బిలియన్ సౌదీ రియళ్ళు ( 533 మిలియన్ డాలర్లు) మంజూరు చేసింది, తక్కువ, మధ్య తరగతి ఆదాయం కలిగిన కుటుంబాల కోసం కొత్త సంక్షేమ వ్యవస్థలో మొట్టమొదటి నెలవారీ విడతలో కింగ్డమ్ జనాభాలో సగం మంది లబ్ధిదారులుగా ఉన్నారు. ఈ చెల్లింపులలో ఆహార పదార్ధాలు, సేవల వంటి అనేక వస్తువులపై 5 శాతం విలువ ఆధారిత పన్ను, అదేవిధంగా వచ్చే ఏడాది విద్యుత్ మరియు గ్యాసోలిన్ ధరలను పెంచి సబ్సిడీ లలో కోతలు విధించనున్నారు.కార్మిక మరియు సాంఘిక అభివృద్ధి మంత్రి అలీ అల్-ఘఫీస్ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, బ్యాంకు బదిలీల నుంచి దాదాపుగా 3 మిలియన్ల కుటుంబాలకు అందచేసినట్లు తెలిపారు. ఇవి మొత్తం10.6 మిలియన్ల మంది లబ్ధిదారులకు చేరుకున్నాయి. అతను ఆ కుటుంబాలలో సగం మందికి కనీసం 938 సౌదీ రియళ్ళు (250 డాలర్లు ) గరిష్ట చెల్లింపుగాఉందని ఆయన అన్నారు. అలాగే కనీస చెల్లింపుga 300 సౌదీ రియళ్ళు ( 80 డాలర్లు) .ఈ రాబోయే ఆర్ధిక సంవత్సరం కనీసం 978 బిలియన్ సౌదీ రియళ్ళు ( 261 బిలియన్ డాలర్లు ) ఖర్చు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. రాజ్య చరిత్రలో అతిపెద్ద బడ్జెట్ ను ప్రభుత్వం ప్రకటించిన రెండు రోజుల తరువాత చెల్లింపులు వస్తాయి. ప్రభుత్వం ఇప్పటికే పొగాకు ఉత్పత్తులు, శీతల పానీయాలు, ఇంధన పానీయాలపై ఈ ఏడాది పన్నులను , అదేవిధంగా విలాస వస్తువులపై భారీ పన్నును ప్రవేశపెట్టింది. 2018 నాటికి సిటిజన్స్ ఖాతా చెల్లింపులపై దాదాపుగా 32 బిలియన్ సౌదీ రియళ్ళు (8.5 బిలియన్ డాలర్లు) చెల్లించాలని ప్రభుత్వం భావిస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







