జనవరి లో ఏపీలో ప్రధాని పర్యటించే అవకాశం

- December 22, 2017 , by Maagulf
జనవరి లో ఏపీలో ప్రధాని పర్యటించే అవకాశం

ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ వచ్చే నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించే అవకాశముందని పార్లమెంటు సభ్యులు తోట నర్సింహం, రవీంద్రబాబు తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో ప్రధానిని వారు కలిశారు. ఈ సందర్బంగా కోటిపల్లి-నర్సాపూర్ రైల్వేలైన్, గౌతమి బ్రిడ్జి శంకుస్థాపనకు రావాలని కోరారు. ఇందుకు ప్రధాని సానుకూలంగా స్పందించారు. అనంతరం ఎంపీలు విలేకరులతో మాట్లాడుతూ... శంకుస్థాపనకు రావడానికి ప్రధాని సుముఖత వ్యక్తం చేశారన్నారు. వచ్చే నెలలో ప్రధాని పర్యటన ఖరారయ్యే అవకాశం ఉందని వారు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com